ప్రధాన మంత్రి కార్యాలయం
జాతి నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్రను వివరిస్తూ పరమ పూజ్య సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ గారు చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2025 1:15PM by PIB Hyderabad
దేశ సేవకు అంకితమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సేవలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. పరమ పూజ్య సర్ సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ గారు చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. జాతి నిర్మాణంలో సంఘ్ కీలక పాత్రను, భారత నాగరికత విలువలను పెంపొందించడంలో దాని అచంచలమైన నిబద్ధతను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
‘ఎక్స్’ వేదికగా ఆర్ఎస్ఎస్ చేసిన పోస్టుకు స్పందిస్తూ, శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"పరమ పూజ్య సర్ సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ గారు తన స్ఫూర్తిదాయక ప్రసంగంలో జాతి నిర్మాణంలో అమూల్యమైన సంఘ్ సహకారాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దేశానికి శక్తినివ్వడమే కాకుండా మానవాళి అందరికీ ప్రయోజనం చేకూర్చే భారత సహజసిద్ధమైన సామర్థ్యం గురించి ఆయన చక్కగా వివరించారు"
#RSS100Years”
(రిలీజ్ ఐడి: 2174350)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam