ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ముంబయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 13 JUL 2024 8:28PM by PIB Hyderabad

 మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్ గారుముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గారునా కేబినెట్ సహచరులు పీయూష్ గోయల్ గారురాందాస్ అథవాలే గారుఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారుఅజిత్ దాదా పవార్ గారురాష్ట్ర ప్రభుత్వ మంత్రులు మంగళ్ ప్రభాత్ గారుదీపక్ కే సర్కార్ గారుఇతర ప్రముఖులుసోదరీ సోదరులారా!

మహారాష్ట్రలోని నా సోదరీ సోదరులందరికీ శుభాకాంక్షలు!

ఈ రోజు మహారాష్ట్రముంబయిలలో రూ.30,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనప్రారంభోత్సవం చేసే భాగ్యం నాకు లభించిందిఈ ప్రాజెక్టులు ముంబయిదాని పరిసర ప్రాంతాల కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయిరోడ్డురైలు ప్రాజెక్టులతో పాటు మహారాష్ట్ర యువత నైపుణ్యాభివృద్ధి కోసం ఒక ప్రధాన పథకం కూడా ఇందులో ఉందిఇది అనేక ఉద్యోగ అవకాశాలను అందిస్తుందిమీరు దీని గురించి వార్తాపత్రికల్లో చదివి ఉండవచ్చు.. టీవీలోనూ చూసి ఉండవచ్చురెండు-మూడు వారాల కిందటే కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర కోసం వధావన్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపిందిఈ రూ.76,000 కోట్ల ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో 10 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుంది.

మిత్రులారా,

గత నెల రోజులుగా దేశవిదేశాలకు చెందిన పెట్టుబడిదారులు ముంబయిలో సంబరాలు జరుపుకొంటున్నారుచిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి పెట్టుబడిదారుడు మూడోసారి మన ప్రభుత్వం అధికారం చేపట్టడం పట్ల ఉత్సాహంగా ఉన్నారుఎన్‌డీఏ ప్రభుత్వం మాత్రమే స్థిరత్వాన్ని అందించగలదని ప్రజలు గుర్తించారుమూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఈ మూడో పదవీకాలంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మూడు రెట్లు వేగంగా పనిచేస్తుందని నేను ప్రతిజ్ఞ చేసానుఈ వాగ్దానం ఫలించడం మనం ఈ రోజు చూస్తున్నాం.

మిత్రులారా,
మహారాష్ట్రకు అద్భుతమైన చరిత్రదృఢమైన వర్తమానంసుసంపన్న భవిష్యత్తు కల ఉన్నాయిఅభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో మహారాష్ట్ర పాత్ర కీలకమైనదిపారిశ్రామిక బలంవ్యవసాయ శక్తిబలీయమైన ఆర్థిక రంగం ఈ రాష్ట్రం సొంతంఈ శక్తి ముంబయిని దేశ ఆర్థిక రాజధానిగా నిలిపిందిఈ శక్తిని ఉపయోగించుకుని మహారాష్ట్రను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడం.. ముంబయిని ప్రపంచ ఫిన్‌టెక్ రాజధానిగా మార్చడం నా లక్ష్యంపర్యాటకం పరంగా భారత్‌లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నానుఛత్రపతి శివాజీ మహారాజ్ పరాక్రమానికి ప్రతీకలుగా నిలిచే అద్భుతమైన కోటలు.. కొంకణ్‌లోని మంత్రముగ్ధులను చేసే సముద్ర తీరాలుసహ్యాద్రి కొండల మీదుగా ఉత్కంఠభరితమైన అనుభూతి కలిగించే ప్రయాణాలు ఇక్కడ ఉన్నాయిఇక్కడ కాన్ఫరెన్స్ టూరిజంమెడికల్ టూరిజంకు అపారమైన అవకాశాలున్నాయిభారత్ అభివృద్ధిలో మహారాష్ట్ర నూతన అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉందిమనమంతా ఈ ప్రయాణంలో భాగమయ్యాంనేటి కార్యక్రమం ఈ మహాయుతి ప్రభుత్వ మహోన్నత లక్ష్యాలకు అంకితమైంది.

మిత్రులారా,

21వ శతాబ్దపు భారత ఆకాంక్షలు ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో ఉన్నాయిఈ శతాబ్దంలో దాదాపు 25 సంవత్సరాలు గడిచిపోయాయిమన దేశ ప్రజలు వేగవంతమైన అభివృద్ధి కోసం ఆసక్తిగా ఉన్నారురాబోయే 25 సంవత్సరాల్లో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఉన్నారుఈ ప్రయత్నంలో ప్రత్యేకించి ముంబయిసాధారణంగానే మహారాష్ట్ర పాత్ర కీలకంమహారాష్ట్రముంబయి వాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే మా లక్ష్యందీని కోసం ముంబయి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచేందుకు మేం సమష్టి ప్రయత్నాలు చేస్తున్నాంముంబయిలోని కోస్టల్ రోడ్అటల్ సేతు ఇప్పుడు పూర్తయ్యాయిఅటల్ సేతు నిర్మాణ సమయంలో చాలా వ్యతిరేకత ఎదురైంది.. దానిని ఆలస్యం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుందిఈ రోజు ప్రతి ఒక్కరూ దాని అపారమైన ప్రయోజనాలను చూస్తున్నారుప్రతిరోజూ దాదాపు 20,000 వాహనాలు దీనిని ఉపయోగిస్తున్నాయనీప్రతిరోజూ 20-25 లక్షల రూపాయల విలువైన ఇంధనం ఆదా అవుతోందని నాకు సమాచారం అందిందిపన్వేల్ చేరుకోవడానికి ఇప్పుడు దాదాపు 45 నిమిషాల సమయం తగ్గింది.. ఫలితంగా సమయం ఆదా అవుతోందిపర్యావరణ ప్రయోజనాలూ లభిస్తున్నాయిఈ విధానంతో మేం ముంబయి రవాణా వ్యవస్థను ఆధునికీకరిస్తున్నాంముంబయి మెట్రో విస్తరణ కూడా వేగంగా జరుగుతోందిపదేళ్ల కిందట ముంబయిలో కేవలం కిలోమీటర్ల మెట్రో లైన్ మాత్రమే ఉండేది.. ఈ రోజు అది దాదాపు 80 కిలోమీటర్లకు విస్తరించిందిఅదనంగా ముంబయిలో దాదాపు 200 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్ పనులూ జరుగుతున్నాయి.

మిత్రులారా,
భారతీయ రైల్వేల అద్భుత పరివర్తన ముంబయిమహారాష్ట్రలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోందిఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్నాగ్‌పూర్అజ్ని స్టేషన్ల పునరాభివృద్ధి వేగంగా జరుగుతోందిఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లోకమాన్య తిలక్ స్టేషన్‌లలో కొత్త ప్లాట్‌ఫారమ్‌లు ప్రారంభమయ్యాయిఈ స్టేషన్ల నుంచి 24 కోచ్‌లు ఉండే పొడవైన రైళ్లను నడపడానికి ఇది వీలు కల్పిస్తుంది.

మిత్రులారా,

గత దశాబ్దంలో మహారాష్ట్రలో జాతీయ రహదారుల పొడవు మూడు రెట్లు పెరిగిందిగోరేగావ్-ములుంద్ లింక్ రోడ్ ప్రాజెక్ట్ అభివృద్ధి-పర్యావరణం మధ్య సామరస్యాన్ని ప్రదర్శిస్తుందిథానే నుంచి బోరివలి వరకు జంట సొరంగ ప్రాజెక్టు పనులు కూడా ఈ రోజు ప్రారంభమవుతున్నాయిఇది ఈ రెండు ప్రదేశాల మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం కొద్ది నిమిషాలకు తగ్గిస్తుందిమన తీర్థయాత్ర స్థలాలను అభివృద్ధి చేయడానికియాత్రికులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను మెరుగుపర్చడానికి ఎన్‌డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందిప్రస్తుతం లక్షలాది మంది భక్తులు పండరీపూర్ వారీలో భక్తిశ్రద్ధలతో పాలుపంచుకుంటున్నారుపూణే నుంచి పండరీపూర్ వరకు ప్రయాణం సజావుగా సాగేందుకుభక్తులకు తగిన వసతులు అందుబాటులో ఉంచేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందిసంత్ జ్ఞానేశ్వర్ పాల్ఖి మార్గ్‌లో సుమారు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో పనులు పూర్తయ్యాయిసంత్ తుకారాం పాల్ఖి మార్గ్‌లో 110 కిలోమీటర్లకు పైగా పనులు పూర్తయ్యాయిఈ రెండు మార్గాలూ త్వరలోనే యాత్రికులకు అందుబాటులోకి వస్తాయి. (ప్రధానమంత్రి మరాఠీ భాషలో కొన్ని వ్యాఖ్యలు చేశారు.)

సోదరీ సోదరులారా,

ఇటువంటి కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు పర్యాటకంవ్యవసాయంపారిశ్రామిక రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయికొత్త ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తున్నాయిమెరుగైన కనెక్టివిటీ మహిళలకు సౌలభ్యాన్నిభద్రతనూ అందిస్తుంది.. వారి గౌరవాన్ని పెంచుతుందిఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలు పేదలురైతులుమహిళలుయువతకు సాధికారత కల్పిస్తున్నాయిమహారాష్ట్ర మహాయుతి ప్రభుత్వం కూడా అదే నిబద్ధతను పంచుకుంటోందిప్రతి సంవత్సరం 10 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ చేయడం నాకు సంతోషంగా ఉందిప్రధానమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన కింద శిక్షణ సమయంలో ఉపకార వేతనాలనూ అందిస్తారు.

మిత్రులారా,

నైపుణ్యాభివృద్ధిపెద్ద ఎత్తున ఉపాధి దేశానికి చాలా అవసరంఈ లక్ష్యాల కోసం మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందికోవిడ్-19 వంటి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ గత 4-5 సంవత్సరాలుగా భారత్ రికార్డు స్థాయిలో ఉపాధిని సాధించిందిఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపాధిపై ఒక వివరణాత్మక నివేదికను విడుదల చేసిందిగత 3-4 సంవత్సరాల్లో దేశంలో సుమారు కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించినట్లు ఈ నివేదిక పేర్కొన్నదిఈ గణాంకాలు ఉపాధి గురించి తప్పుడు కథనాలను వ్యాప్తి చేసేవారి నోరు మూయిస్తాయిఇటువంటి తప్పుడు కథనాలు పెట్టుబడిమౌలిక సదుపాయాల అభివృద్ధికిదేశ పురోగతికీ హానికరంవారి ప్రతి విధానం యువతకు ద్రోహం చేయడంఉపాధిని అడ్డుకోవడం లక్ష్యంగా ఉందివారి నిజమైన ఉద్దేశాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయిభారత ప్రజలు తెలివైనవారు.. అందుకే వారి అబద్ధాలుమోసాలను తిరస్కరిస్తున్నారువంతెన నిర్మించినప్పుడల్లా.. రైల్వే ట్రాక్ వేసినప్పుడల్లా.. రహదారి నిర్మించినప్పుడల్లా.. స్థానికంగా రైలు కోచ్ తయారు చేసినప్పుడల్లా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయిదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం పెరిగేకొద్దీ ఉద్యోగాల సృష్టి రేటు కూడా పెరుగుతుందిరాబోయే కాలంలో మరిన్ని కొత్త పెట్టుబడులతో ఈ అవకాశాలు మరింత పెరుగుతాయి.

మిత్రులారా,
ఎన్‌డీఏ ప్రభుత్వ అభివృద్ధి నమూనా సమాజంలోని అణగారిన వర్గాలకు ప్రాధాన్యమిస్తుందిదశాబ్దాలుగా సామాజికంగా అట్టడుగున ఉన్న వారిపై మేం దృష్టి సారించాంకొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పేదలకు పక్కా ఇళ్లకు సంబంధించి మేం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాంరైతుల సంక్షేమం కోసం ముఖ్యమైన చర్యలు తీసుకున్నాంఇప్పటివరకు కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లను అందించాంరాబోయే సంవత్సరాల్లో మహారాష్ట్రలోని లక్షలాది మంది పేదలుదళితులువెనకబడినగిరిజన కుటుంబాలు సహా కోట్ల మంది పేద కుటుంబాలకు పక్కా ఇళ్లను అందిస్తాంమంచి ఇల్లు ప్రతి కుటుంబానికి అవసరం మాత్రమే కాదు.. కుటుంబ గౌరవానికి సంబంధించినదిఅందుకే నగరాల్లో నివసిస్తున్న పేదలుమధ్యతరగతి వారి ఇంటి కలను నెరవేర్చడానికి మేం కృషి చేస్తున్నాం.

మిత్రులారా,

వీధి వ్యాపారులు గౌరవప్రదమైన జీవితాలను గడిపేలా చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాంఈ విషయంలో స్వనిధి యోజన వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉందిఇప్పటివరకు ఈ పథకం కింద 90 లక్షల రుణాలు మంజూరయ్యాయివీటిలో దాదాపు 13 లక్షల రుణాలు మహారాష్ట్రలోని విక్రేతలకు వెళ్ళాయికేవలం ముంబయిలోనే 1.5 లక్షల మంది వీధి వ్యాపారులు స్వనిధి యోజన ద్వారా ప్రయోజనం పొందారుస్వనిధి ద్వారా బ్యాంకుల నుంచి లభించే సహాయం వారి వ్యాపారాలను బలోపేతం చేస్తోందిఈ పథకంతో సంబంధం ఉన్న వారి నెలవారీ ఆదాయం సుమారు 2,000 రూపాయలు పెరిగింది.. అంటే సంవత్సరానికి 20,000-25,000 రూపాయల అదనపు ఆదాయం వారికి లభిస్తున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

మిత్రులారా,
స్వనిధి పథకం గురించి మరో ముఖ్యమైన విషయాన్ని నేను ప్రధానంగా ప్రస్తావించాలనుకుంటున్నానుఈ రుణాలను పొందినవారు వాటిని పూర్తిగా తిరిగి చెల్లిస్తున్నారుఇది నా పేద సోదరీ సోదరుల ఆత్మగౌరవాన్నిసమగ్రతను ప్రతిబింబిస్తుందివిశేషమేమిటంటే.. స్వనిధి లబ్ధిదారులు ఇప్పటివరకు రూ. 3.25 లక్షల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు నిర్వహించారుఇది డిజిటల్ ఇండియాను శక్తిమంతం చేయడమే కాకుండా మన దేశానికి కొత్త గుర్తింపును కూడా ఇస్తుంది.

మిత్రులారా,

దేశంలో సాంస్కృతికసామాజికజాతీయ చైతన్యానికి మహారాష్ట్ర గణనీయంగా దోహదపడిందిఈ భూమి ఛత్రపతి శివాజీ మహారాజ్బాబాసాహెబ్ అంబేద్కర్మహాత్మా జ్యోతిబా ఫూలేసావిత్రిబాయి ఫూలేఅన్నాభావు సాథేలోకమాన్య తిలక్వీర్ సావర్కర్ వంటి అనేక మంది మహనీయుల వారసత్వాలకు నిలయంఈ ప్రముఖ వ్యక్తులు ఊహించిన సామరస్యపూర్వక సమాజంబలమైన దేశం కోసం మనం కృషి చేయాలిశ్రేయస్సుకు మార్గం సామరస్యంసద్భావనలోనే ఉందని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యంఈ భావనతోనే ఈ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానుచాలా ధన్యవాదాలు!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

చాలా ధన్యవాదాలు.

గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.

 

***


(Release ID: 2173386) Visitor Counter : 11