ప్రధాన మంత్రి కార్యాలయం
అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి.. అందరికీ శక్తితో పాటు సుఖశాంతులు దక్కాలని కోరుకున్న ప్రధాని
Posted On:
28 SEP 2025 9:00AM by PIB Hyderabad
దేశానికి మంచి జరిగేందుకు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమ్మవారికి ప్రార్థనలు చేశారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో దేశ ప్రజలంతా సుఖశాంతులతో, ధైర్యంతో, మనోనిబ్బరంతో ఉండేలా అనుగ్రహించాల్సిందిగా అమ్మవారిని ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ మోదీ ఒక వీడియోను పొందుపరుస్తూ:
‘‘అమ్మవారి చరణాలకు కోటి కోటి ప్రణామాలు. అందరికీ గొప్ప సాహసమూ, ఉత్తమ ఆరోగ్యమూ కలబోసిన ఆశీర్వాదాన్ని అందించాల్సిందంటూ అమ్మవారిని ప్రార్థించాను. అమ్మ దయతో అందరి జీవనంలో ఆత్మబలం ఉప్పొంగు గాక’’
https://www.youtube.com/watch?v=xipST4S094Q”
(Release ID: 2172614)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam