ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో జరిగే ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్-2025ను స్వాగతించిన ప్రధానమంత్రి
Posted On:
27 SEP 2025 6:03PM by PIB Hyderabad
ఈ రోజు నుంచి ఢిల్లీలో జరగనున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్-2025కు క్రీడాకారులు, ప్రతినిధులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా స్వాగతించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
"ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్-2025ను ఢిల్లీలో నిర్వహించటం పట్ల భారతదేశం గర్వంగా ఉంది. పాల్గొనే వారందరికీ హృదయపూర్వక స్వాగతం, శుభాకాంక్షలు. ఈ టోర్నమెంట్ మానవ సంకల్పానికీ, స్ఫూర్తికీ చిహ్నంగా నిలుస్తోంది. ఈ టోర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా మరింత సమ్మిళితమైన, శక్తిమంతమైన క్రీడా సంస్కృతిని పెంచాలని కోరుకుంటున్నాను"
(Release ID: 2172364)
Visitor Counter : 24
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam