ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల ప్రభావాన్ని వివరించిన ప్రధానమంత్రి
Posted On:
24 SEP 2025 1:12PM by PIB Hyderabad
దేశాభివృద్ధికి కీలక స్తంభంగా ఉన్న భారత వైద్య రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రముఖ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ దేవీ ప్రసాద్ శెట్టి ఇటీవల ఓ వ్యాసంలో పేర్కొన్నట్లు.. ఆయుష్మాన్ భారత్, పోషణ అభియాన్, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తున్నాయని పేర్కొన్నారు.
‘ఎక్స్’ మాధ్యమంలో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఇలా అన్నారు:
“భారదేశ వైద్య రంగం ఇప్పుడు ఆర్థికవృద్ధికి ప్రధాన చోదకశక్తిగా మారిందని డాక్టర్ దేవీ ప్రసాద్ శెట్టి ఒక వ్యాసం రాశారు. ఆయుష్మాన్ భారత్, పోషణ్ అభియాన్, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు వ్యాధుల భారాన్ని తగ్గిస్తూ...ప్రజల పొదుపును కాపాడటంతోపాటు మానవ వనరులను అభివృద్ధి చేస్తున్నాయి. ఆరోగ్యాన్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడటం ద్వారా పాలన, సంక్షేమం మెరుగవుతున్నాయి.”
(Release ID: 2170612)
Visitor Counter : 6
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam