ప్రధాన మంత్రి కార్యాలయం
భారత‑మారిషస్: వర్చువల్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Posted On:
29 FEB 2024 3:06PM by PIB Hyderabad
గౌరవనీయులు ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ గారికి,
మారిషస్ మంత్రివర్గ సభ్యులకు,
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ గారికి,
నేటి కార్యక్రమానికి హాజరైన అగలేగా నివాసితులకు,
నా స్నేహితులందరికీ నమస్కారం!
గత ఆరు నెలల్లో మారిషస్ ప్రధాని జుగ్నాథ్, నేను సమావేశమవ్వడం ఇది అయిదోసారి. భారత్, మారిషస్ మధ్య ఉన్న శక్తిమంతమైన, బలమైన, ప్రత్యేకమైన భాగస్వామ్యానికి ఇది నిదర్శనం. పొరుగు దేశాల ప్రాధాన్యతలో మారిషస్ మా ముఖ్య భాగస్వామిగా ఉంది. అలాగే ‘సాగర్’ దృష్టికోణంలో మారిషస్ మా ప్రత్యేక భాగస్వామి. గ్లోబల్ సౌత్ సభ్యులుగా మాకు ఉమ్మడి ప్రాధాన్యతలున్నాయి. గత 10 సంవత్సరాల్లో మా సంబంధాల్లో అపూర్వమైన వేగం కనిపించింది. పరస్పర సహకారంతో కొత్త శిఖరాలను చేరుకున్నాం. సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు కొత్త రూపం దాల్చాయి. భాష, సంస్కృతులు ప్రజల్ని కలిపి ఉంచాయి. కొన్ని రోజుల కిందటే యూపీఐ, రూపే కార్డు వంటి ప్రయత్నాల ద్వారా ఆధునిక డిజిటల్ అనుసంధానాన్ని అందించాం.
మిత్రులారా,
మా వ్యూహాత్మక సంబంధాల్లో అభివృద్ధి భాగస్వామ్యం ఒక ముఖ్యమైన స్తంభంగా నిలిచింది. ఈ భాగస్వామ్యం మారిషస్ ప్రాధాన్యతల ఆధారంగా నిర్మితమై ఉంది. భద్రతా అవసరాలు అయినా, ఆరోగ్య భద్రత అయినా, భారత్ ఎప్పుడూ మారిషస్ అవసరాలను గౌరవంగా వచ్చింది. కోవిడ్ మహమ్మారి సంక్షోభం అయినా, చమురు లీకేజీ ప్రమాదం అయినా, భారత్ తన మిత్రుడు మారిషస్కు మొదట స్పందించే దేశంగా నిలిచింది. మారిషస్లోని సాధారణ ప్రజల జీవితాల్లో సార్థకమైన మార్పులను తీసుకురావడమే మా ప్రయత్నాల ప్రధాన లక్ష్యం.
గత 10 సంవత్సరాల్లో సుమారు 1000 మిలియన్ డాలర్ల రుణ సౌకర్యం, 400 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం మారిషస్ ప్రజలకు అందించాం. మెట్రో లైన్లు అభివృద్ధి, సమాజాభివృద్ధి ప్రాజెక్టులు, సామాజిక గృహ నిర్మాణం, చెవి,ముక్కు, కంటి ఆసుపత్రులు, సివిల్ సర్వీస్ కళాశాలలు, క్రీడా సముదాయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఈ భాగస్వామ్యం భారత్, మారిషస్ మధ్య ఉన్న స్నేహబంధాన్ని, సహకార శక్తిని ప్రతిబింబిస్తుంది.
మిత్రులారా,
మా అభివృద్ధి భాగస్వామ్యానికి నేడు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన రోజు. 2015లో అగలేగా ప్రజల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీ నేడు పూర్తవుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో భారత్లో దీన్ని ‘‘మోదీ హామీ’’అని పిలుస్తున్నారు. మేం కలిసి ప్రారంభించిన ఈ సదుపాయాలు ప్రజల జీవన విధానాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతాయని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మారిషస్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరుగుతుంది. ముఖ్య భూభాగం నుంచి పరిపాలనా సహకారం మరింత సులభమవుతుంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి బలమైన తోడ్పాటు లభిస్తుంది. అ సదుపాయాలు వైద్య చికిత్స అవసరమైన అత్యవసర పరిస్థితులలో రవాణా, విద్యార్థుల ప్రయాణం మెరగవుతుంది.
మిత్రులారా,
ఈ మధ్య కాలంలో భారత మహాసముద్ర ప్రాంతంలో అనేక సంప్రదాయ, సాంప్రదాయేతర సవాళ్లు తలెత్తుతున్నాయి. ఈ సవాళ్లన్నీ మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు భారత్, మారిషస్ సముద్ర భద్రతా రంగంలో సహజ భాగస్వాములుగా ఉన్నాయి. భారత మహాసముద్ర ప్రాంతంలో భద్రత, అభివృద్ధి, స్థిరత్వాన్ని సాధించేందుకు మేం ఇద్దరం కలిసికట్టుగా పని చేస్తున్నాం. ప్రత్యేక ఆర్థిక ప్రాంతాల పర్యవేక్షణ, ఉమ్మడి గస్తీ, హైడ్రోగ్రఫీ, మానవతా సాయం, విపత్తు సహాయ చర్యలు వంటి అన్ని రంగాలలో మేము పరస్పర సహకారాన్ని కొనసాగిస్తున్నాం. నేడు ఆగలేగా ద్వీపంలో జరిగిన ఎయిర్స్ట్రిప్, జెట్టీ ప్రారంభోత్సవం మా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళుతుంది. ఇది మారిషస్లో సముద్ర ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.
మిత్రులారా,
మారిషస్లో జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్ గారిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. జన్ ఔషధి కార్యక్రమంలో చేరిన తొలి దేశంగా మరిషస్ నిలవడం గర్వకారణం. దీని ద్వారా భారత్లో తయారైన ఉన్నత నాణ్యత గల జనరిక్ ఔషధాల ప్రయోజనాలు మారిషస్ ప్రజలకు లభించనున్నాయి.
గౌరవనీయులు,
ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్ దూరదృష్టి, గొప్ప నాయకత్వానికి అభినందనలు. రాబోయే కాలంలో మనం కలసి పనిచేసి మారిషస్, భారత్ మధ్య సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామనే నమ్మకం నాకు ఉంది.
మరోసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు!
***
(Release ID: 2170111)
Visitor Counter : 8
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam