ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రి సందర్భంగా పండిట్ జస్రాజ్ గారి మధురగీతాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


ప్రజలు తమకిష్టమైన భజనలను పంచుకోవాలని ఆహ్వానించిన ప్రధానమంత్రి

Posted On: 22 SEP 2025 9:32AM by PIB Hyderabad

నవరాత్రి సందర్భంగా భారతీయ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ ఆలపించిన మధుర గీతాన్ని ప్రధానమంత్రిశ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారునవరాత్రి అంటే పవిత్రమైన భక్తితో కూడినదనీ, చాలా మంది ఈ భక్తిని సంగీతం రూపంలో చెప్పారని శ్రీ మోదీ అన్నారు. "మీరు పాడిన ఏదైనా భజన పాటను లేదా మీకు ఇష్టమైన భజనను నాతో పంచుకోండివాటిల్లో కొన్నింటిని రాబోయే రోజుల్లో నేను పోస్టు చేస్తాను!" అని శ్రీ మోదీ తెలిపారు.

'ఎక్స్పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"నవరాత్రి అంటే పవిత్రమైన భక్తిఎంతోమంది ఈ భక్తిని సంగీతం ద్వారా అద్భుతంగా చాటి చెప్పారుమనసును హత్తుకునే జస్రాజ్ గారి ఒక గీతాన్ని మీతో పంచుకుంటున్నాను.

మీరు పాడిన ఏదైనా భజనపాటను లేదా మీకు ఇష్టమైన భజనను నాతో పంచుకోండివాటిల్లో కొన్నింటిని రాబోయే రోజుల్లో నేను పోస్టు చేస్తాను!

https://youtube.com/watch?v=0NlwLAkuXvo"

 

 

***

MJPS/VJ


(Release ID: 2169472)