ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి సందర్భంగా పండిట్ జస్రాజ్ గారి మధురగీతాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
ప్రజలు తమకిష్టమైన భజనలను పంచుకోవాలని ఆహ్వానించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
22 SEP 2025 9:32AM by PIB Hyderabad
నవరాత్రి సందర్భంగా భారతీయ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ ఆలపించిన మధుర గీతాన్ని ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. నవరాత్రి అంటే పవిత్రమైన భక్తితో కూడినదనీ, చాలా మంది ఈ భక్తిని సంగీతం రూపంలో చెప్పారని శ్రీ మోదీ అన్నారు. "మీరు పాడిన ఏదైనా భజన పాటను లేదా మీకు ఇష్టమైన భజనను నాతో పంచుకోండి. వాటిల్లో కొన్నింటిని రాబోయే రోజుల్లో నేను పోస్టు చేస్తాను!" అని శ్రీ మోదీ తెలిపారు.
'ఎక్స్' పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"నవరాత్రి అంటే పవిత్రమైన భక్తి. ఎంతోమంది ఈ భక్తిని సంగీతం ద్వారా అద్భుతంగా చాటి చెప్పారు. మనసును హత్తుకునే జస్రాజ్ గారి ఒక గీతాన్ని మీతో పంచుకుంటున్నాను.
మీరు పాడిన ఏదైనా భజనపాటను లేదా మీకు ఇష్టమైన భజనను నాతో పంచుకోండి. వాటిల్లో కొన్నింటిని రాబోయే రోజుల్లో నేను పోస్టు చేస్తాను!
https://youtube.com/watch?v=0NlwLAkuXvo"
***
MJPS/VJ
(రిలీజ్ ఐడి: 2169472)
సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam