ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరీక్షా పే చర్చ 2024లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి


“మన పిల్లలలో సహనశక్తిని పెంపొందించి ఒత్తిళ్లను ఎదుర్కోవడంలో సహాయంగా ఉండడం ఎంతో ముఖ్యం”

"విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలసి పరిష్కరించాలి"

"ఆరోగ్యకరమైన పోటీతోనే విద్యార్థుల వికాసం”

“ఉపాధ్యాయులది ఉద్యోగ పాత్ర కాదు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత వారిపై ఉంది”

"తల్లిదండ్రులు పిల్లల రిపోర్ట్ కార్డులను వారి విజిటింగ్ కార్డుగా మార్చుకోకూడదు"

“విద్యార్థులు, ఉపాధ్యాయుల బంధం పాఠ్యప్రణాళిక, పాఠ్యాంశాలకు అతీతంగా ఉండాలి"

"మీ పిల్లల మధ్య పోటీ, శత్రుత్వ బీజాలను ఎప్పుడూ నాటవద్దు. సొదరీసొదరులు ఒకరికొకరు స్ఫూర్తిదాయకం కావాలి"

"మీరు చేసే అన్ని పనులలోనూ, చదువులోనూ నిబద్ధతతో, నిర్ణయాత్మకంగా ఉండటానికి ప్రయత్నించండి"

"వీలైనంత వరకు సమాధానాలు రాయడం అలవాటు చేసుకోండి. మీరు ఆ అభ్యాసం కలిగి ఉంటే, పరీక్షా కేంద్రంలో ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది”

“టెక్నాలజీ భారం కాకూడదు. దానిని విచక్షణాయుతంగా ఉపయోగించండి"

“సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. కాబట్టి దాని కోసం వేచి చూడకండి. సవాళ్లు ఎదురవ

Posted On: 29 JAN 2024 1:39PM by PIB Hyderabad

 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీ లోని భారత మండపంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు,  తల్లితండ్రులతో పరీక్షా పే చర్చా (పీపీసీఏడో సంచికను నిర్వహించారుఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ ను  ఆయన తిలకించారుపరీక్షా పే చర్చ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  కృషితో నడిచే ఒక ఉద్యమంవిద్యార్థులుతల్లిదండ్రులుఉపాధ్యాయులుసమాజాన్ని ఒక చోట చేర్చిప్రతి బిడ్డ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని గౌరవించేప్రోత్సహించేతనను తాను పూర్తిగా వ్యక్తీకరించుకునే వాతావరణాన్ని సృష్టించడం దీని ఉద్దేశం.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి విద్యార్థులు, ఉపాధ్యాయులుతల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తూఎగ్జిబిషన్లో  నూతన జాతీయ విద్యా విధానం వంటి ఆకాంక్షలుభావనలపై  వివిధ రూపాల్లో విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలను ప్రస్తావించారుఈ ఆవిష్కరణలు వివిధ అంశాల గురించి కొత్త తరాలు ఏమనుకుంటున్నారోఈ సమస్యలకు వారి వద్ద ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు.

చర్చా వేదిక అయిన భారత మండపం ప్రాముఖ్యాన్ని గురించి విద్యార్థులకు వివరిస్తూ, ఇందులో జరిగిన జి-20 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచంలోని ప్రధాన నాయకులందరూ కలసి ప్రపంచ భవిష్యత్తు పై  చర్చించడం గురించి తెలిపారు.

బయటి నుంచి ఒత్తిడి, ఆందోళన

విద్యార్థులపై అదనపు ఒత్తిడి పెంచే సాంస్కృతిక  సామాజిక అంచనాలు వంటి బాహ్య అంశాలను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ఒమన్‌లోని ఒక ప్రైవేట్ సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థిని దానియా షాబుఢిల్లీ బురారీలోని గవర్నమెంట్ సర్వోదయ బాల విద్యాలయానికి చెందిన ఎం.డిఅర్ష్ ప్రస్తావించారుప్రధానమంత్రి మాట్లాడుతూఏడో సంచిక అయినప్పటికీ సాంస్కృతికసామాజిక అంచనాలకు సంబంధించిన ప్రశ్నలు పీపీసీలో ప్రతీసారీ ప్రస్తావనకు వస్తూనేఉన్నాయని అన్నారువిద్యార్థులపై బాహ్య ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆయన స్పష్టం చేశారుఅలాగే తల్లిదండ్రులు కూడా ఈ అనుభవాన్ని తరచూ ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారుఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనిదానిని జీవితంలోని భాగంగా భావించి సిద్ధం కావాలని ప్రధానమంత్రి  సూచించారుఅలవాటు పడిన ఒక వాతావరణ పరిస్థితి నుంచి  మరో అతి విరుద్ధమైన వాతావరణ పరిస్థితికి ప్రయాణం చేయడాన్ని  ఉదాహరణను చూపిస్తూమనసు ముందుగానే తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా సిద్ధమవుతుందనిఅలాగే విద్యార్థులు కూడా మానసికంగా తమకు తామే సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారుఒత్తిడి స్థాయిని అంచనా వేసిదాన్ని క్రమంగా పెంచుతూ ముందుకు సాగితే విద్యార్థుల సామర్థ్యానికి ఆటంకం కలగదని అన్నారువ్యవస్థీకృత సిద్ధాంతాన్ని అమలు చేయడం కంటేప్రక్రియను అభివృద్ధి చేసుకుంటూ వెళ్లే క్రమంలో విద్యార్థులుకుటుంబ సభ్యులుఉపాధ్యాయులు కలిసి బాహ్య ఒత్తిడి సమస్యను ఎదుర్కోవాలని శ్రీ  మోదీ పిలుపునిచ్చారుఅలాగేవిద్యార్థుల కుటుంబాలు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధానాలను చర్చించుకోవాలని ఆయన సూచించారు.

స్నేహితుల మధ్య ఒత్తిడిపోటీ

స్నేహితుల మధ్య ఒత్తిడిపోటీకి సంబంధించి  అండమాన్,నికోబార్ దీవులలోని గవర్నమెంట్ డెమాన్‌స్ట్రేషన్ మల్టిపర్పస్ స్కూల్ కు చెందిన భాగ్యలక్ష్మిగుజరాత్ లోని జెఎన్‌వి పంచమహల్ కు చెందిన దృష్టీ చౌహాన్కేరళ లోని కోజికోడ్ కేంద్రీయ విద్యాలయానికి చెందిన స్వాతి దిలీప్ అడిగిన ప్రశ్నలకు ప్రధానమంత్రి సమాధానమిస్తూపోటీ ప్రాముఖ్యతను వివరించారు.  అయితేపోటీ ఆరోగ్యకరంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారుచాలా సందర్భాలలోఅనారోగ్యకరమైన పోటీకి బీజాలు కుటుంబ పరిస్థితుల్లోనే పడతాయనిఇది తోబుట్టువుల మధ్య విపరీతమైన పోటీకి దారితీస్తుందని ఆయన చెప్పారుపిల్లల మధ్య పోలికలను మానుకోవాలని తల్లిదండ్రులను మోదీ కోరారు.  ఆరోగ్యకరమైన రీతిలో పోటీ పడుతూనే ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి పిల్లలు ప్రాధాన్యం ఇచ్చిన వీడియో ఉదాహరణను ప్రధాన మంత్రి ఇచ్చారుపరీక్షలలో బాగా రాణించడం అనేది సున్నా మొత్తం ఆట కాదనిపోటీ ఎవరితోనో కాదుమనతో మనకే అని ఆయన అన్నారుస్నేహితుని మంచి ప్రదర్శన మన ప్రదర్శనకు ఏమాత్రం అడ్డు కాదని  అన్నారుఈ ధోరణిస్ఫూర్తిదాయకం కాని వారితో స్నేహం చేసేందుకు దారితీయవచ్చని ప్రధానమంత్రి పేర్కొన్నారుతమ పిల్లలను ఇతరులతో పోల్చవద్దని ఆయన తల్లిదండ్రులను కూడా కోరారు.  పిల్లల విజయాన్ని తమ విజిటింగ్ కార్డ్‌గా చేసుకోవద్దని కూడా ఆయన వారిని కోరారు.  స్నేహితుల విజయాన్ని చూసి ఆనందించాలని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు. ‘స్నేహం అనేది లావాదేవీలతో కూడిన భావోద్వేగం కాదు’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు

విద్యార్థులకు స్ఫూర్తినివ్వడంలో ఉపాధ్యాయుల పాత్ర 

ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సంగీత ఉపాధ్యాయుడు శ్రీ కొండకంచి సంపతరావు,   అస్సాంలోని శివసాగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు బంటీ మేడి అడిగిన ప్రశ్నలకు ప్రధానమంత్రి సమాధానమిస్తూవిద్యార్థులను ప్రేరేపించడంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి ప్రధానమంత్రి వివరించారుఒక తరగతికి మాత్రమే కాకుండా పాఠశాల మొత్తానికి చెందిన విద్యార్థుల ఒత్తిడిని సంగీతం దూరం చేయగలదని ప్రధానమంత్రి అన్నారుతరగతి మొదటి రోజు నుంచి  పరీక్షల సమయం వరకు విద్యార్థిఉపాధ్యాయుల అనుబంధాన్ని క్రమంగా విస్తరించాలని స్పష్టం చేశారుఇందువల్ల పరీక్షల సమయంలో ఒత్తిడిని పూర్తిగా తొలగిస్తుందని అన్నారుకేవలం తాము బోధించే సబ్జెక్టుల ఆధారంగా  మాత్రమే విద్యార్థులకు  అందుబాటులో ఉండడం కాకుండా ఎల్లవేళలా వారితో సన్నిహితంగా ఉండాలని  ఆయన ఉపాధ్యాయులను కోరారుతమ రోగులతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండే వైద్యులను ఉదాహరణగా పేర్కొంటూఇఅటువంటి బంధం సగం నివారణగా పనిచేస్తుందని ప్రధానమంత్రి అన్నారువిద్యార్థుల కుటుంబాలతో కూడా వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవాలనివారి ముందు విద్యార్థుల తెలివితేటలను అభినందించాలని  ఆయన సూచించారు. “ఉపాధ్యాయులు ఉద్యోగ పాత్రలో లేరు.  వారు విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యతను మోస్తున్నారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

పరీక్షల ఒత్తిడిని జయించడం   

పశ్చిమ త్రిపురలోని ప్రణవానంద విద్యా  మందిర్‌కు చెందిన అద్రియా చక్రవర్తిఛత్తీస్‌గఢ్‌  బస్తర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థి షేక్ తైఫుర్ రెహమాన్,   ఒడిశా లోని కటక్‌ ఆదర్శ విద్యాలయ కు చెందిన రాజ్యలక్ష్మి ఆచార్య పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎదుర్కోవడం గురించి ప్రధానమంత్రిని అడిగారుతల్లిదండ్రుల అతి ఉత్సాహం లేదా విద్యార్థుల అతి చిత్తశుద్ధి వల్ల తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి వివరించారుకొత్త బట్టలుఆచారాలు లేదా కొత్త వస్తువులతో  పరీక్ష రోజున  అతిగా హంగామా చేయవద్దని ఆయన తల్లిదండ్రులను కోరారుచివరి నిమిషం వరకు సన్నద్ధమవుతూ ఉండవద్దనిమనసులో ఎలాంటి అలజడి లేకుండా పరీక్షలకు హాజరు కావాలనిఅనవసరమైన ఒత్తిడికి  దారితీసే కారణమయ్యే బయటి ప్రతికూలతలను దూరం చేసుకోవాలని ఆయన సూచించారుచివరి నిమిషంలో ఎలాంటి భయం లేకుండాప్రశ్నపత్రాన్ని చదివితగిన సమయాన్ని కేటాయిస్తూ సమాధానాలు రాయాలని ప్రధానమంత్రి వారికి సూచించారుచాలా వరకు పరీక్షలు ఇంకా రాతపరీక్షలే అనికంప్యూటర్లుఫోన్ల వల్ల రాసే అలవాటు తగ్గిపోతోందని  ప్రధానమంత్రి అన్నారురాయడం అలవాటు చేసుకోవాలని ఆయన వారిని కోరారు.  చదివే/అధ్యయనం చేసే సమయంలో 50 శాతం రాయడానికి కేటాయించాలని ఆయన వారిని కోరారు.  ఏదైనా రాసినప్పుడు మాత్రమే  దానిని సరిగా అర్థం చేసుకుంటారని ఆయన అన్నారుఇతర విద్యార్థుల వేగాన్ని చూసి భయపడవద్దని ఆయన వారిని కోరారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి

పరీక్షలకు సిద్ధం కావడానికి,   ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి మధ్య సమతుల్యత గురించి ప్రస్తావిస్తూరాజస్థాన్‌లోని సీనియర్ సెకండరీ పాఠశాల విద్యార్థి ధీరజ్ సుభాస్లడఖ్‌లోని కార్గిల్‌ పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థిని నజ్మా ఖాతూన్,  అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ టోబి లాహ్మే ఉపాధ్యాయుడు అభిషేక్ కుమార్ తివారీవ్యాయామంతో పాటు చదువులను ఎలా సాగించాలని ప్రధానమంత్రిని అడిగారుశారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం మొబైల్ ఫోన్లను రీఛార్జ్ చేసుకోవాలని అన్నారుసమతుల్య జీవనశైలి పాటించాలనిఏదీ  అతిగా చేయకూడదని ఆయన సూచించారు. “ఆరోగ్యకరమైన మనసు కోసం ఆరోగ్యకరమైన శరీరం చాలా అవసరం” అని ప్రధానమంత్రి అన్నారుఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రోజువారీ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందనిసూర్యరశ్మిలో సమయం గడపడంసక్రమంగా పూర్తి నిద్రపోవడం వంటి విషయాలను కూడా ఆయన ప్రస్తావించారుఆధునిక ఆరోగ్య శాస్త్రం ప్రకారం  చాలా ముఖ్యమైనదిగా భావించే  అవసరమైన నిద్రను స్క్రీన్ సమయం వంటి అలవాట్లు తినేస్తున్నాయని ఆయన అన్నారుతాను కూడా  పడుకున్న 30 సెకన్లలోనే గాఢ నిద్రలోకి వెళ్లే శైలిని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. "మెలకువగా ఉన్నప్పుడు పూర్తిగా మెలకువగా ఉండటంనిద్రలో ఉన్నప్పుడు గాఢ నిద్రపోవడమే సమతుల్యతఅని ఆయన అన్నారుపోషకాహారం గురించి మాట్లాడుతూసమతుల్య ఆహారంపై దృష్టి పెట్టాలని సూచించారుఫిట్‌నెస్ కోసం క్రమం తప్పని వ్యాయామంశారీరక శ్రమల ప్రాముఖ్యతను కూడా ఆయన వివరించారు.

కెరీర్ పురోగతి

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణా బారక్‌పూర్‌లోని కేంద్రీయ విద్యాలయకు చెందిన మధుమిత మల్లిక్హర్యానాలో పానిపట్‌లోని ది మిలీనియం స్కూల్‌కు చెందిన అదితి తన్వర్‌ ప్రస్తావించిన కెరీర్ పురోగతి అంశంపై ప్రధానమంత్రి మాట్లాడుతూవృత్తి జీవన మార్గం విషయంలో స్పష్టత అవసరమని,  గందరగోళంఅనిశ్చితి ఉండరాదని స్పష్టం చేశారు.  పరిశుభ్రతకు ఉదాహరణనుదాని వెనుక ఉన్న ప్రధానమంత్రి సంకల్పాన్ని వివరిస్తూదేశంలో 'స్వచ్ఛతఒక ప్రాధాన్యతాంశంగా మారుతోందని శ్రీ మోదీ ఉద్ఘాటించారుగత 10 సంవత్సరాలలో కళసాంస్కృతిక రంగంలో భారతదేశ మార్కెట్ 250 రెట్లు పెరిగిందని ఆయన తెలియజేశారు. “మనకు సామర్థ్యం ఉంటేదేనికైనా జీవం పోయగలం” అని ఆయన అన్నారువిద్యార్థులు తమను తాము తక్కువ అంచనా వేసుకోరాదని ప్రధాని  అన్నారుపూర్తి అంకితభావంతో ముందుకు సాగాలని  ఆయన సూచించారుజాతీయ విద్యా విధానం గురించి మాట్లాడుతూఒకే స్ట్రీమ్‌కు కట్టుబడి ఉండకుండా విభిన్న కోర్సులను అనుసరించే నిబంధనలను ప్రధానమంత్రి ప్రముఖంగా తెలిపారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  ఎగ్జిబిషన్‌లో విద్యార్థుల భాగస్వామ్యంనైపుణ్యంఅంకితభావాన్ని ఆయన ప్రశంసించారుప్రభుత్వ పథకాలను తెలియజేయడానికి వారు చేసిన కృషి భారత ప్రభుత్వ సమాచారప్రసార మంత్రిత్వ శాఖతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. "గందరగోళాన్ని తొలగించడానికి మనం నిర్ణయాత్మకంగా ఉండాలిఅని ప్రధానమంత్రి అన్నారు.  రెస్టారెంట్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేసే ఉదాహరణను ఇస్తూఅక్కడ ఏమి తినాలో నిర్ణయించుకోవాలిఅలాగేతీసుకోవాల్సిన నిర్ణయాల సానుకూలతలుప్రతికూలతలను కూడా అంచనా వేసుకోవాలని ఆయన సూచించారు.

తల్లిదండ్రుల పాత్ర

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కార్యక్రమంలో చేరిన పుదుచ్చేరి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థిని దీపశ్రీ తల్లిదండ్రుల పాత్ర గురించివిద్యార్థులు నమ్మకాన్ని పెంచుకోవడం గురించి ప్రధానమంత్రిని అడిగారుప్రధానమంత్రి కుటుంబాల్లో నమ్మకం లోపించడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులనుఉపాధ్యాయులను కోరారుఈ సమస్య ఆకస్మికం కాదనిసుదీర్ఘ ప్రక్రియ ఫలితమనిఉపాధ్యాయులైనా, , తల్లిదండ్రులైనాలేదా విద్యార్థులయినా ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తనపై లోతైన ఆత్మపరిశీలన  అవసరమని శ్రీ మోదీ అన్నారుసమాచారాన్ని నిజాయితీతో పంచుకుంటే  నమ్మకం క్రమంగా పెరుగుతుందని ఆయన అన్నారువిద్యార్థులు తమ వ్యవహారాల్లో నిజాయితీగాచిత్తశుద్ధితో ఉండాలిఅదేవిధంగాతల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై అనుమానానికి బదులుగా  నమ్మకాన్ని ఉంచాలినమ్మకం లేకపోవడం వల్ల ఏర్పడే దూరం పిల్లలను డిప్రెషన్‌ వైపు నెట్టవచ్చువిద్యార్థులతో కమ్యూనికేషన్ మార్గాలను తెరిచి ఉంచాలని,   పక్షపాతానికి దూరంగా ఉండాలని ప్రధానమంత్రి ఉపాధ్యాయులను కోరారుపిల్లలకు సహాయపడే సానుకూల విషయాలను చర్చించడానికి స్నేహితుల కుటుంబాలు క్రమం తప్పకుండా కలుసుకోవాలని ఆయన అభ్యర్థించారు.

టెక్నాలజీ చొరబాటు

మహారాష్ట్ర లోని పూనేకు కు చెందిన తండ్రి చంద్రేష్ జైన్ విద్యార్థుల జీవితాల్లో టెక్నాలజీ చొరబాటు అంశాన్ని లేవనెత్తగాజార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌కు చెందిన తల్లి  పూజా శ్రీవాస్తవ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ మధ్య చదువులను ఎలా నిర్వహించాలని  అడిగారు.హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్కాంగూలోని టీఆర్ డీఏవీ పాఠశాల విద్యార్థి అభినవ్ రాణా అభ్యాస సాధనంగా మొబైల్ టెక్నాలజీ ప్రయోజనాలను ఉపయోగించుకుంటూనే,  పరీక్షల ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా విద్యార్థులకు అవగాహనప్రోత్సాహం కల్పించడం గురించి ప్రస్తావించారు. "దేనికైనా అతి పనికిరాదుఅని ప్రధానమంత్రి అన్నారుపోషకాలు అధికంగా ఉన్నప్పటికీఇంట్లో వండిన భోజనాన్ని అతిగా తీసుకుంటే కడుపులో సమస్యలు,   ఇతర సమస్యలు వస్తాయని,  మొబైల్ ఫోన్‌ను అధికంగా వినియోగించినా అంతేనని ఆయన పోల్చారువిచక్షణ ఆధారిత నిర్ణయాలతో టెక్నాలజీనిమొబైల్ ఫోన్‌లను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.  "తల్లిదండ్రులంతా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు"అని ప్రధానమంత్రి గోప్యత  రహస్యం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ అన్నారురాత్రి భోజనం సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు వాడకుండాఇంట్లో నో గాడ్జెట్ జోన్‌ లు ఉండేలా కుటుంబంలో నియమనిబంధనలు ఉండాలని ప్రధాని పేర్కొన్నారు. "ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీకి దూరంగా  ఎవరూ పారిపోలేరుఅని ప్రధానమంత్రి అన్నారుఅయితేదానిని  ఒక భారంగా పరిగణించకుండా,   సమర్థవంతంగా వినియోగించడాన్ని  నేర్చుకోవడం తప్పనిసరి అని ఆయన అన్నారుటెక్నాలజీ ఒక విద్యా సాధనం  అని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి సూచించారు.   పారదర్శకతను నెలకొల్పడానికి తమ ఇళ్లలోని ప్రతి మొబైల్ ఫోన్ పాస్‌కోడ్‌లను ప్రతి సభ్యునితో పంచుకోవాలని కూడా సిఫార్సు చేశారు. "ఇది చాలా చెడులను నివారిస్తుందిఅని ఆయన అన్నారుప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్‌లు,   సాధనాల వాడకంతో స్క్రీన్ సమయాన్ని పర్యవేక్షించడం గురించి కూడా ప్రధానమంత్రి  ప్రస్తావించారుతరగతి గదిలో మొబైల్ ఫోన్ల సృజనాత్మక వినియోగం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

ప్రధానమంత్రిగా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు?  ఎలా సానుకూలంగా ఉంటారు?

చెన్నైలోని మోడరన్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థి ఎం వాగేష్  ప్రధానమంత్రి పదవిలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నారని  ప్రధానమంత్రిని అడిగారుఉత్తరాఖండ్‌లోని ఉదం సింగ్ నగర్‌ కు చెందిన డైనాస్టీ మోడరన్ గురుకుల్ అకాడమీ విద్యార్థిని స్నేహా త్యాగి, “ మేం మీలాగా సానుకూలంగా ఎలా ఉండగలం?” అని ప్రధానమంత్రిని ప్రశ్నించారుప్రధాన మంత్రి పదవిలో ఉండే ఒత్తిడిని పిల్లలు అర్థం చేసుకోవడం సంతోషం కలిగిస్తోందని శ్రీ మోదీ  అన్నారుజీవితంలో ప్రతి ఒక్కరూ ఊహించని  పరిస్థితులను ఎదుర్కొంటారనివాటిని తప్పించుకు తిరుగుదామనుకునేవారు జీవితంలో ఏదీ పెద్దగా సాధించలేరని ఆయన అన్నారు. "నాకు ఉపయోగకరంగా అనిపించిన నా విధానం ఏమిటంటే, 'నేను ప్రతి సవాల్ ను సవాలు చేస్తాసవాలు ముగిసేవరకు ఏం చేయకుండా చూస్తూ ఉండిపోనుఇది నాకు ఎల్లప్పుడూ  నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుందికొత్త పరిస్థితులను ఎదుర్కోవడం నన్ను మరింత చురుగ్గా  చేస్తుంది” అన్నారు. “నాకు 140 కోట్ల మంది దేశప్రజలు  అండగా ఉన్నారన్నదే నాకు అతిపెద్ద విశ్వాసం. 10 కోట్ల సవాళ్లు ఉంటేవందల కోట్ల పరిష్కారాలు ఉంటాయినేను ఎప్పుడూ ఒంటరిగా ఉన్నాననిఅంతా నాపైనే ఉందని భావించనునా దేశందేశప్రజల సామర్థ్యాల గురించి నాకు తెలుసుఇదే నా ఆలోచనకు మూలాధారంఅని ఆయన  అన్నారుతాను ముందుండాల్సి వస్తుందనితప్పులు తనవే అంటరానిఅయినా దేశ సామర్థ్యాలు తనకు బలం ఇస్తాయని తెలిపారు. "నా దేశప్రజల సామర్థ్యాలను నేను ఎంతగా పెంచితేసవాళ్లను ఎదుర్కొనే నా సామర్థ్యం అంతగా మెరుగుపడుతుందిఅని ఆయన అన్నారు.  పేదరికం సమస్యను ఉదాహరణగా పేర్కొంటూపేదవారే పేదరికాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నప్పుడుపేదరికం తప్పక పోతుందని ప్రధానమంత్రి అన్నారు.  "పక్కా ఇల్లుమరుగుదొడ్డివిద్యఆయుష్మాన్పైపుల ద్వారా నీరు వంటి కలలను సాకారం చేసుకునే సాధనాలను వారికి అందించడం నా బాధ్యతప్రతిరోజు ఎదుర్కొనే అవమానాల నుంచి ఒకసారి విముక్తి పొందిన తర్వాతపేదరిక నిర్మూలనపై వారికి నమ్మకం కలుగుతుంది” అని చెప్పారుతన 10 సంవత్సరాల పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి  బయటపడ్డారని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండాఎవరికైనా పనులకు ప్రాధాన్యత ఇచ్చే వివేకం ఉండాలని ప్రధానమంత్రి అన్నారుఇది అనుభవం,  అన్నింటినీ విశ్లేషించడం ద్వారా వస్తుందితాను చేసే పొరపాట్లను కూడా పాఠాలుగా పరిగణిస్తానని  ఆయన అన్నారు.

కోవిడ్ మహమ్మారిని ఉదాహరణగా పేర్కొంటూచేతులు ముడుచుకు కూర్చోవడం కంటే ప్రజలను ఒక తాటిపైకి తెచ్చివారి సామూహిక శక్తిని పెంచే దిశగా ప్రయత్నించానని ప్రధానమంత్రి చెప్పారుదీపాలు వెలిగించడంశబ్దం చేయించడం  వంటి చర్యల ద్వారా ప్రజలలో నమ్మకాన్ని నింపినట్లు పేర్కొన్నారుఅలాగేక్రీడా విజయాలను జరుపుకోవడంసరైన వ్యూహందిశనాయకత్వం వల్ల అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్లో విస్తృత స్థాయిలో పతకాలు సాధించగలిగామని అన్నారు.

సుపరిపాలన కోసం కూడాకింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి సంపూర్ణ సమాచారంఅలాగే ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయికి సంపూర్ణ మార్గదర్శకత్వం అందించే వ్యవస్థ ఉండాలని ఆయన అన్నారు

జీవితంలో ఎప్పుడూ అసంతృప్తి కూడదనినిర్ణయం తీసుకున్న తర్వాత సానుకూలత మాత్రమే మిగిలి ఉంటుందని ప్రధాని అన్నారు. "నా జీవితంలో నిరాశ అనేదానికి అన్ని దారులుకిటికీలు మూసేశానుఅని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుఏదైనా చేయాలనే సంకల్పం బలంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుందని ఆయన అన్నారు. "స్వార్థపూరిత ఉద్దేశ్యం లేనప్పుడునిర్ణయంలో ఎప్పుడూ గందరగోళం ఉండదుఅని స్పష్టం చేశారు.  ప్రస్తుత తరం జీవితాలను సులభతరం చేయడానికి ప్రాధాన్యత ఇస్తూతమ తల్లిదండ్రులు పడిన కష్టాలను నేటి తరం ఎదుర్కోకూడదని ప్రధానమంత్రి అన్నారు. "ప్రస్తుత తరమే కాకుండాభవిష్యత్ తరాలు కూడా తమ ప్రతిభను చాటుకోవడానికితమ సామర్థ్యాలను ప్రదర్శించడానికి అవకాశం ఉన్న దేశాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందిఅని ప్రధానమంత్రి అన్నారుఇది మొత్తం దేశం  సామూహిక సంకల్పంగా ఉండాలని స్పష్టం చేశారు.  సానుకూల దృక్పథం  శక్తిని వివరిస్తూఅత్యంత ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూల ఫలితాలను చూసేందుకు  అది బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి అన్నారువిద్యార్థులంతా వారి జీవిత లక్ష్యాలను సాధించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- 


(Release ID: 2168845) Visitor Counter : 7