ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా కప్ రజత పతక విజేతగా నిలిచిన భారత మహిళల హాకీ జట్టు... అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 SEP 2025 9:21PM by PIB Hyderabad
మహిళల ఆసియా కప్-2025లో శ్రేష్ఠమైన ఆటతీరును కనబరిచి, రజత పతకాన్ని చేజిక్కించుకొని దేశ ప్రజలు గర్వించేలా చేసిన భారత మహిళా హాకీ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘మహిళల ఆసియా కప్-2025లో రజత పతకాన్ని గెలిచి మన మహిళా హాకీ జట్టు దేశ ప్రజలను గర్వించేలా చేసింది. అందించింది వారికి అభినందనలు. జట్టు దృఢ సంకల్పం, కలిసికట్టుగా ఆడిన తీరు అద్భుతం. రాబోయే కాలంలో వారు మరిన్ని విజయాలను సాధించాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2166902)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam