ప్రధాన మంత్రి కార్యాలయం
కర్ణాటకలోని హసన్లో ప్రమాదం వల్ల ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించిన ప్రధాని
Posted On:
13 SEP 2025 8:36AM by PIB Hyderabad
కర్ణాటక రాష్ట్రం హసన్లో సంభవించిన ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి తలా రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“కర్ణాటకలోని హసన్లో ప్రమాద సంఘటన హృదయాన్ని కలచివేసింది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న మృతుల కుటుంబాలకు ఆత్మస్థైర్యం ఇవ్వాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. అలాగే గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి తలా రూ.2 లక్షలు, క్షతగాత్రులకు తలా రూ.50,000 వంతున పరిహారం చెల్లిస్తామని ప్రకటిస్తున్నాను” అని ప్రధానమంత్రి PM @narendramodi పేర్కొన్నట్లు తెలిపింది.
(Release ID: 2166239)
Visitor Counter : 2
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam