ప్రధాన మంత్రి కార్యాలయం
ఈశాన్య ప్రాంతం... దేశానికి అగ్రగామిగా ఎలా మారుతోందో వివరించిన వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 SEP 2025 1:16PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంతం దేశానికి అగ్రగామిగా ఎలా మారుతోందో వివరించిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకొన్నారు. బైరాబీ-సైరాంగ్ రైల్వే స్టేషన్ ప్రారంభం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందనీ, మిజోరంను జాతీయ రైల్వే నెట్వర్కుకు జోడించడం ద్వారా వాణిజ్యానికీ, సంధానానికీ కొత్త అవకాశాలను అందించనున్నదనీ.. కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ వ్యాసం తెలియజేసిందని ప్రధానమంత్రి తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో పీఎంఓ ఇండియా ఇలా పేర్కొంది:
‘‘ఈశాన్య ప్రాంతం ఇక ప్రగతి సాధనకు ఎదురుచూస్తున్న ఒక సరిహద్దు ప్రాంతమేమీ కాదు... ఇది భారతదేశ అభివృద్ధిగాథకు కేంద్ర బిందువుగా మారింది. బైరాబీ-సైరాంగ్ రైల్వే స్టేషన్ను ప్రారంభించుకోవడం ఒక చరిత్రాత్మక ఘట్టం... ఇది మిజోరంను జాతీయ రైల్వే నెట్వర్కుతో జోడించి వాణిజ్యానికీ, సంధానానికీ, అవకాశాలకూ కొత్త అవకాశాలను అందిస్తోంది.
కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ (@AshwiniVaishnaw) రాసిన వ్యాసాన్ని చదవండి.. ఆ వ్యాసంలో ఈశాన్య ప్రాంతం మన దేశంలో అగ్రగామిగా ఎలా ఎదుగుతోందీ వివరించారు.’’
***
(రిలీజ్ ఐడి: 2166171)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam