ప్రధాన మంత్రి కార్యాలయం
జెరూసలేంలో జరిగిన ఘోర ఉగ్రదాడిని ఖండించిన ప్రధానమంత్రి
Posted On:
08 SEP 2025 9:23PM by PIB Hyderabad
జెరూసలేంలో అమాయక ప్రజలపై ఈ రోజు జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ‘‘అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని, దాన్ని వ్యక్తపరిచే విధానాలను భారత్ ఖండిస్తోంది. అలాగే ఉగ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించని విధానంపై దృఢంగా నిలబడుతుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘జెరూసలేంలోని అమాయక ప్రజలపై ఈ రోజు జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం
అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని, దాన్ని వ్యక్తపరిచే విధానాలను భారత్ ఖండిస్తోంది. అలాగే ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని విధానంపై దృఢంగా నిలబడుతుంది’’
@netanyahu
(Release ID: 2164870)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam