రక్షణ మంత్రిత్వ శాఖ
కలకత్తాలో సెప్టెంబర్ 15న కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి
సంస్కరణలు, పరివర్తన, మార్పు, కార్యాచరణ సంసిద్ధతపై దృష్టి
Posted On:
08 SEP 2025 3:50PM by PIB Hyderabad
భారత సాయుధ దళాలు సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు కలకత్తా, పశ్చిమ బెంగాల్ లో కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ (సీసీసీ)-2025ని నిర్వహించనున్నాయి. "సంస్కరణల సంవత్సరం - భవిష్యత్తులోకి ప్రయాణం" అనే థీమ్ తో ఈ సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి ప్రారంభించనున్న ఈ సమావేశానికి రక్షణమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ శాఖ కార్యదర్శి, త్రివిధ దళాధిపతి హాజరవుతారు. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాల అధికారులతో పాటు ఇతర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
సంస్కరణలు, పరివర్తన, మార్పు, కార్యాచరణ సంసిద్ధతపై సీసీసీ 2025 దృష్టి సారించనుంది. ఇవి సంస్థాగత సంస్కరణలు, లోతైన సమన్వయం, సాంకేతిక ఆధునికీకరణ పట్ల సాయుధ దళాల నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. అదే సమయంలో, బహుళ రంగాల కార్యకలాపాల సంసిద్ధతను సూచిస్తాయి. సంక్లిష్టంగా మారుతున్న భౌగోళిక-వ్యూహాత్మక పరిణామాల మధ్య చురుకైన, నిర్ణయాత్మక సాయుధ దళాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరగనున్నాయి. సమ్మిళిత భాగస్వామ్య పద్ధతిని కొనసాగిస్తూ, సాయుధ దళాల్లోని వివిధ స్థాయుల అధికారులు, సిబ్బందితో ముఖాముఖి చర్చలను ఈ సదస్సు నిర్వహిస్తుంది. దీనివల్ల... క్షేత్ర స్థాయి అభిప్రాయాలు ఉన్నతస్థాయి చర్చలకు మరింత విలువను జోడిస్తాయి.
సీసీసీ అనేది సాయుధ దళాల అత్యున్నత స్థాయి సమాలోచన వేదిక. ఇది దేశంలోని అత్యున్నత పౌర, సైనిక నాయకత్వం ఒకచోట చేరి, ప్రాథమికంగా, వ్యూహాత్మకంగా అభిప్రాయాలు పంచుకోవటానికి సహకరిస్తుంది.
***
(Release ID: 2164729)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam