ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, వికసిత్ భారత్ సాధనకు దోహదపడనున్న తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు: ప్రధానమంత్రి

Posted On: 04 SEP 2025 9:15PM by PIB Hyderabad

భారతదేశ ఆర్ధిక నిర్మాణాన్నిఅంతర్జాతీయ స్థితిని మార్చిన సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలపై గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా వెల్లడించారుపెట్టుబడులకు ఊతమిచ్చిన కార్పొరేట్ పన్ను తగ్గింపుల నుంచిదేశీయ మార్కెట్ ను ఏకీకృతం చేసిన జీఎస్టీ అమలు వరకుఅలాగే జీవన సౌలభ్యం పెంచిన వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గింపు వరకు సంస్కరణల పథం నిరంతరం ప్రజాప్రయోజనాల ఆధారితంగా కొనసాగుతోంది.

పన్ను విధానాలను సులభతరం చేయడంరేట్లను సరళీకరించడంవ్యవస్థను మరింత సమానత్వంగావృద్ధి ఆధారితంగా మార్చడం ద్వారా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న తాజా జీఎస్టీ సంస్కరణల దశను ఆయన ప్రశంసించారుఈ చర్యలకు తోడుగాభారతదేశ దృఢమైన ఆర్ధిక క్రమశిక్షణ అంతర్జాతీయ స్థాయిలో విశ్వాసాన్ని పెంచుకుని ప్రభుత్వ క్రెడిట్ రేటింగ్స్ మెరుగుపడటానికి దారి తీసింది.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో శ్రీ విజయ్ చేసిన ఒక పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ, “గత దశాబ్దం భారతదేశ ఆర్థిక దృశ్యాన్ని మార్చే సాహసోపేతమైన సంస్కరణలకుపెట్టుబడిని ప్రేరేపించిన కార్పొరేట్ పన్ను తగ్గింపుల నుంచి ఏకీకృత మార్కెట్ ను సృష్టించిన జీఎస్టీజీవన సౌలభ్యాన్ని పెంపొందించిన వ్యక్తిగత ఆదాయ పన్ను సంస్కరణలకు సంబంధించినదికొత్త జీఎస్టీ సంస్కరణలు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూవ్యవస్థను మరింత సులభంగాసక్రమంగా,  వృద్ధి ఆధారితంగా మారుస్తాయివీటికి తోడు మన ఆర్ధిక క్రమశిక్షణ ప్రపంచవ్యాప్తంగా విశ్వాసాన్నిమెరుగైన క్రెడిట్ రేటింగ్స్‌ను కూడా సాధించిందిఈ ప్రయత్నాల ద్వారా మనం వికసిత్ భారత్ కోసం ఒక బలమైన పునాదిని వేస్తున్నాం” అని పేర్కొన్నారు

 

***


(Release ID: 2164308) Visitor Counter : 3