ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రష్యా అధ్యక్షుడిని కలిసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 01 SEP 2025 1:08PM by PIB Hyderabad

చైనాలోని టియాంజిన్‌లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు.

ఇద్దరు నేతలు ఆర్థికద్రవ్యఇంధన రంగాలతో సహా ద్వైపాక్షిక సహకారం గురించి చర్చించారుఈ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల వృద్ధిపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్‌కు సంబంధించిన తాజా పరిణామాలుప్రాంతీయప్రపంచ సమస్యల గురించి కూడా ఇద్దరు నేతలు చర్చించారుఉక్రెయిన్‌లోని ఘర్షణను పరిష్కరించటానికి ఇటీవల తీసుకున్న చర్యలకు ప్రధానమంత్రి తన మద్దతు తెలిపారుఘర్షణను త్వరగా ముగించటానికిశాశ్వత ప్రాతిపదికన శాంతి పరిష్కారాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇద్దరు నేతలు రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేకవిశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటానికి తమ మద్దతును తెలియజేశారుభారత్ లో జరిగే 23వ వార్షిక సదస్సు కోసం ఈ ఏడాది చివర్లో అధ్యక్షుడు పుతిన్ భారతదేశాన్ని సందర్శించేందుకు ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2162827) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam