ప్రధాన మంత్రి కార్యాలయం
షోరింజన్ డారుమా-జీ ఆలయ ముఖ్య పూజారి రెవ్ సేషీ హిరోసే చేతుల మీదుగా డారుమా బొమ్మను అందుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
29 AUG 2025 4:29PM by PIB Hyderabad
జపాన్లోని గున్మాలోని టకాసాకీ సిటీలోని షోరింజన్ డారుమా-జీ ఆలయ ముఖ్య పూజారి రెవ్ సేషీ హిరోసే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి డారుమా బొమ్మను బహుమతిగా ఈ రోజు అందజేశారు. ఈ బహుమతి భారత్కు, జపాన్కు మధ్య ఉన్న సన్నిహిత నాగరికత, ఆధ్యాత్మిక బంధాలకు ప్రతీకగా ఉంది.
డారుమా డాల్ను జపానీయుల సంస్కృతిలో శుభప్రదమైందిగా, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. గున్మాలోని టకాసాకీ సిటీ ప్రఖ్యాత డారుమా బొమ్మలకు పుట్టినిల్లు. జపాన్లో ‘డారుమా దైశీ’గా పేరుపొందిన ఒక బోధిధర్మ భారతదేశంలోని కాంచీపురం నుంచి ఇక్కడికి చేరుకున్నారు. ఈయన పేరిట జపాన్లో డారుమా సంప్రదాయం ఏర్పడింది. డారుమా దైశీ వేయి సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం కిందట, జపాన్ నుంచి ఇక్కడికి తరలివచ్చారు.
(रिलीज़ आईडी: 2162024)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam