ప్రధాన మంత్రి కార్యాలయం
చరిత్రాత్మక ‘భారత్-బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం’పై ఒక వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
25 JUL 2025 1:21PM by PIB Hyderabad
భారత్-బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ‘‘భారత్, బ్రిటన్ల మధ్య కుదిరిన ఈ చరిత్రాత్మక సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం భారతీయ రైతులు, మత్స్యకారులు, చేతివృత్తుల వారు, చిన్న వ్యాపారాల సాధికారతకు తోడ్పడుతుంది. దీంతో పాటు వినియోగదారులకు ప్రతి రోజూ మెరుగైన ధరలకు నాణ్యమైన ఉత్పాదనలు అందుబాటులోకి వస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నమోదు చేసిన ఒక సందేశానికి ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రతిస్పందిస్తూ:
‘‘భారత్, బ్రిటన్ల మధ్య కుదిరిన ఈ చరిత్రాత్మక ‘సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం’ ఏ విధంగా భారతీయ రైతులు, మత్స్యకారులు, చేతివృత్తుల వారు, చిన్న వ్యాపారాల సాధికారతకు తోడ్పడడంతో పాటు, వినియోగదారులకు ప్రతి రోజూ మెరుగైన ధరలకు నాణ్యమైన ఉత్పాదనలు అందుబాటులోకి వస్తాయో వివరించింది’’ అని పేర్కొంది.
***
(Release ID: 2148376)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam