ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్, బ్రిటన్ వ్యాపారవేత్తలతో సమావేశమైన ఇరు దేశాల ప్రధానమంత్రులు

Posted On: 24 JUL 2025 7:38PM by PIB Hyderabad

చారిత్రాత్మక భారత్బ్రిటన్ సమగ్ర ఆర్థికవాణిజ్య ఒప్పందంపై (సీఈటీఏసంతకం చేసిన తర్వాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీబ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ ఈ రోజు ఇరు దేశాల వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారుఆరోగ్యంఔషధాలురత్నాలు ఆభరణాలువాహనాలుఇంధనంతయారీటెలికాంటెక్నాలజీఐటీసరకు రవాణావస్త్రాలుఆర్థిక సేవల రంగాలకు చెందిన పరిశ్రమల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారుఈ రంగాలు రెండు దేశాల్లో ఉపాధి కల్పనసమగ్ర ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నాయి.

ఇటీవలి సంవత్సరాల్లో ద్వైపాక్షిక వాణిజ్యంపెట్టుబడి సంబంధాలు విస్తరించినట్లు ఇరు దేశాల నాయకులు గుర్తించారువ్యాపారవేత్తలతో మాట్లాడుతూ.. వాణిజ్యంపెట్టుబడిఆవిష్కరణలకు సంబంధించిన భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు సీఈటీఏ తీసుకొచ్చిన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరారుద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించటం ద్వారా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే విషయంలో తమ నిబద్ధతను ఇద్దరు ప్రధానులు పునరుద్ఘాటించారుకొత్త ఒప్పందం రెండు దేశాల్లో వ్యాపార వాతావరణానికిప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని అన్నారుసీఈటీఐ ప్రయోజనాలను స్పష్టంగా తెలియజేస్తూ ఇద్దరు నాయకులు రెండు దేశాలకు చెందిన ప్రతిష్ఠాత్మక ఉత్పత్తులుఆవిష్కరణలను ప్రదర్శించారురత్నాలు-ఆభరణాలుఇంజనీరింగ్ వస్తువులునాణ్యమైన వినియోగ ఉత్పత్తులుఅధునాతన సాంకేతిక పరిష్కారాలు ప్రదర్శనలో భాగంగా ఉన్నాయి.

ఈ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని భారత్బ్రిటన్ వ్యాపారవేత్తలు ప్రశంసించారుసమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త శకానికి ఇది నాంది పలుకుతుందన్నారువాణిజ్యంఆర్థిక వ్యవస్థకు మాత్రమే పరిమతి కాకుండా వర్థమాన సాంకేతికతలువిద్యఆవిష్కరణపరిశోధనఆరోగ్య రంగాలలో కూడా సహకారాన్ని మరింతగా పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

***


(Release ID: 2148130)