ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్‌... దుర్గాపూర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 18 JUL 2025 5:57PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సి.విఆనంద బోస్ గారుకేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు హర్దీప్ సింగ్ పురీ గారుశాంతనూ ఠాకుర్ గారుసుఖాంత మజుందార్ గారుపశ్చిమ బెంగాల్ శాసనసభ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారుపార్లమెంటులో నా సహచరులు సౌమిక్ భట్టాచార్య గారుజ్యోతిర్మయ్ సింగ్ మహతో గారుఇతర ప్రజా ప్రతినిధులునా ప్రియమైన సోదర సోదరీమణులారానమస్కారం!

మన దుర్గాపూర్ ఉక్కు నగరంగానే కాకుండా భారత శ్రామిక శక్తికి ప్రధాన కేంద్రంగా కూడా పేరుగాంచిందిదుర్గాపూర్ భారత్ అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషిస్తోందినేడు ఆ పాత్రను మరింత బలోపేతం చేసుకునే అవకాశం మనకు ఉందికొద్దిసేపటి కిందట 5,400 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభంశంకుస్థాపనలు ఇక్కడ జరిగాయిఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో అనుసంధానాన్ని పెంచుతాయిఇవి గ్యాస్ ఆధారిత రవాణా వ్యవస్థనుగ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థనూ ప్రోత్సహిస్తాయిఈ రోజు ప్రారంభించుకున్న ప్రాజెక్టులు ఈ ఉక్కు నగరం గుర్తింపును మరింత బలోపేతం చేస్తాయిమరో మాటలో చెప్పాలంటేఈ కార్యక్రమాలు "మేక్ ఇన్ ఇండియామేక్ ఫర్ ది వరల్డ్అనే మంత్రంతో పశ్చిమ బెంగాల్ మరింత ముందుకు సాగడానికి తోడ్పడుతాయిఇవి ఈ ప్రాంత యువతకు అనేక ఉపాధి అవకాశాలను కూడా అందిస్తాయిఈ ప్రాజెక్టుల ప్రారంభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

నేడు ప్రపంచం 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశంతీర్మానాల గురించి మాట్లాడుతోందిభారత్ అంతటా కనిపిస్తున్న మార్పు దీని వెనక ఉన్నాయిఅవి 'వికసిత్ భారత్కు పునాది వేస్తున్న పరివర్తనలుఈ మార్పుల్లో ప్రధానమైనది దేశంలోని మౌలిక సదుపాయాలునేను మౌలిక సదుపాయాల గురించి మాట్లాడేటప్పుడు.. నేను సామాజికభౌతికడిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రస్తావిస్తానుఅవి పేదలకు నాలుగు కోట్లకు పైగా శాశ్వత గృహాలుకోట్లాది మరుగుదొడ్లు12 కోట్లకు పైగా కుళాయి నీటి కనెక్షన్లువేల కిలోమీటర్ల కొత్త రహదారులుకొత్త జాతీయ రహదారులుకొత్త రైలు మార్గాలుచిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలుప్రతి ఇంటికీగ్రామానికీ ఇంటర్నెట్ సదుపాయంఈ ఆధునిక మౌలిక సదుపాయాలన్నీ పశ్చిమ బెంగాల్‌ సహా దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తున్నాయి.

మిత్రులారా,

పశ్చిమ బెంగాల్‌లో రైలు కనెక్టివిటీ విషయంలో అపూర్వమైన అభివృద్ధి జరిగిందిదేశంలో వందే భారత్ రైళ్లు పెద్ద సంఖ్యలో నడుస్తున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటికోల్‌కతా మెట్రో వేగంగా విస్తరిస్తోందిఇక్కడ కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారురైలు మార్గాల విస్తరణవిద్యుదీకరణ పనులూ వేగంగా జరుగుతున్నాయిఅనేక రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నారుఅదనంగా పెద్ద సంఖ్యలో రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు కూడా నిర్మిస్తున్నారుఈరోజు పశ్చిమ బెంగాల్‌కు మరో రెండు రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు మంజూరయ్యాయిఈ ప్రయత్నాలన్నీ బెంగాల్ ప్రజల జీవితాలను ఎంతో సులభతరం చేస్తాయి.

మిత్రులారా,

మేం ఇక్కడి విమానాశ్రయాన్ని ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్పథకంతో అనుసంధానించాంగత సంవత్సరంలోనే5,00,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించారుఅటువంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినప్పుడు ప్రజలు మెరుగైన సౌకర్యాల నుంచి ప్రయోజనం పొందడమే కాకుండావేలాది మంది యువతకు ఉపాధి కూడా లభిస్తుందని మీకు బాగా తెలుసుఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఉపయోగించే ముడి పదార్థాల తయారీ ద్వారానూ పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోంది.

మిత్రులారా,

గత 10–11 సంవత్సరాల్లో దేశంలో గ్యాస్ కనెక్టివిటీపై జరిగిన కృషి సాటిలేనిదిగత దశాబ్దంలో ఎల్‌పీజీ గ్యాస్ దేశంలోని ప్రతి ఇంటికీ చేరుకుందిఈ విజయాన్ని ప్రపంచమంతా ప్రశంసించిందిమేం ఒకే దేశంఒకే గ్యాస్ గ్రిడ్ దార్శనికతతో పనిచేశాంప్రధానమంత్రి ఉర్జా గంగా యోజనను ప్రారంభించాంఈ పథకం కిందపశ్చిమ బెంగాల్‌ సహా తూర్పు భారతంలోని ఆరు రాష్ట్రాల్లో గ్యాస్ పైప్‌లైన్లు వేస్తున్నారుఈ రాష్ట్రాల్లోని పరిశ్రమలకుగృహాలకూ సరసమైన ధరకే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేయడం దీని లక్ష్యంగ్యాస్ అందుబాటులో ఉంటే ఈ రాష్ట్రాల్లోని వాహనాలు సీఎన్‌జీతో నడుస్తాయి. అలాగే మన పరిశ్రమలూ గ్యాస్ ఆధారిత సాంకేతికతలను అందిపుచ్చుకుంటాయిదుర్గాపూర్ పారిశ్రామిక ప్రాంతం ఇప్పుడు జాతీయ గ్యాస్ గ్రిడ్‌లో భాగమవడం సంతోషంగా ఉందిఇది స్థానిక పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందిఈ ప్రాజెక్ట్ ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని సుమారు 25 నుంచి 30 లక్షల గృహాలకు సరసమైన ధరకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందిదీని అర్థం ఈ కుటుంబాల జీవితం.. ముఖ్యంగా మన తల్లులుసోదరీమణుల జీవితం సులభతరం అవుతుందిఫలితంగా వేలాది ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి.

మిత్రులారా,

ప్రధాన ఉక్కువిద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలైన దుర్గాపూర్రఘునాథ్‌పూర్‌లోనూ కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందివాటిలో దాదాపు 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారుఈ ప్లాంట్లు ఇప్పుడు మరింత సమర్థంగా మారి.. ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నాయిఈ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయినందుకు బెంగాల్ ప్రజలకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

భారత కర్మాగారాలు అయినామన పంటపొలాలుసాగుభూములు అయినా - 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే స్పష్టమైన సంకల్పంతోనే ప్రతిచోటా పనులు జరుగుతున్నాయిఅభివృద్ధి ద్వారా సాధికారతఉపాధి ద్వారా స్వావలంబనసున్నితత్వం ద్వారా సుపరిపాలన అందించడం మా మార్గంగా ఉందిఈ సూత్రాల మార్గనిర్దేశంలో పశ్చిమ బెంగాల్‌ను భారత్ అభివృద్ధి ప్రయాణంలో శక్తిమంతమైన చోదకశక్తిగా మార్చాలని మేం నిశ్చయించాంమరోసారిఈ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభ సందర్భంగా మీ అందరినీ అభినందిస్తున్నానుఇంకా చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి. కానీ ఈ వేదికపై చెప్పడానికి బదులుగా.. సమీపంలోని తదుపరి వేదిక ద్వారా మరిన్ని విషయాలను చెప్పడం మంచిదిఅక్కడ నేను ఏమి చెబుతానో వినడానికి మొత్తం బెంగాల్యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోందిమీడియా కూడా చాలా ఆసక్తిగా ఉందికాబట్టి మిత్రులారాఈ కార్యక్రమం కోసం నేను ఇక్కడ నా మాటలను ఇంతటితో ఆపుతానుకానీ కొద్ది సేపట్లోనే అక్కడ నుంచి మరిన్ని విషయాలను మీతో పంచుకుంటాను.

చాలా ధన్యవాదాలు.

 

***


(Release ID: 2145865)