ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమెరికాలోని టెక్సాస్‌ వరదల్లో ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

Posted On: 06 JUL 2025 12:06AM by PIB Hyderabad

అమెరికాలోని టెక్సాస్‌‌లో సంభవించిన వినాశకరమైన వరదల్లో ప్రాణనష్టం, ముఖ్యంగా పిల్లలు మరణించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు. 

"టెక్సాస్‌లో సంభవించిన వినాశకరమైన వరదల్లో ప్రాణ నష్టం, ముఖ్యంగా పిల్లలు మరణించటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు, అమెరికా ప్రభుత్వానికి సంతాపం తెలియజేస్తున్నాను."

 

 

***

MJPS/ST


(Release ID: 2142606)