ప్రధాన మంత్రి కార్యాలయం
స్వామి వివేకానంద గారి వర్ధంతి.. ప్రధానమంత్రి నివాళులు
प्रविष्टि तिथि:
04 JUL 2025 8:50AM by PIB Hyderabad
స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. మన సమాజం ఎలా రూపుదిద్దుకోవాలనే విషయంలో స్వామి వివేకానంద గారి ఆలోచనలు, దార్శనికత మనకు దారి దీపంలా నిలిచి ఉన్నాయని ఆయన అన్నారు. మన చరిత్ర పట్ల, మన సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వాన్నీ, ఆత్మవిశ్వాస భావననూ ఆయన జాగృతం చేశారని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నేను శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. మన సమాజం ఎలా రూపుదిద్దుకోవాలనే విషయంలో స్వామి వివేకానంద గారి ఆలోచనలు, దృష్టికోణం మనకు దారి దీపం లాంటివి. మన చరిత్ర పట్ల, మన సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వాన్నీ, ఆత్మవిశ్వాస భావననూ ఆయన జాగృతం చేశారు. సేవాపథంలో ముందు ముందుకు సాగిపోతూ ఉండాలనీ, అలాగే కరుణమార్గాన్ని అనుసరించాలనీ కూడా ఆయన ఉద్ఘాటించారు’’ అని పేర్కొన్నారు.
****
MJPS/ST
(रिलीज़ आईडी: 2142061)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam