ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

11 ఏళ్లలో చెప్పుకోదగ్గ మార్పులకు నిలయంగా గనుల రంగం... ఒక వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 23 JUN 2025 3:06PM by PIB Hyderabad

గత పదకొండు సంవత్సరాల్లో గనుల రంగంలో చేపట్టిన కీలక సంస్కరణలు భారత్‌లో సహకారపూర్వక సమాఖ్యవాదానికి, పారదర్శక పాలనకు ఈ రంగం ఏయే విధాలుగా  మార్గదర్శకంగా నిలిచిందీ వివరించిన ఒక వ్యాసాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.


సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి స్పందిస్తూ:


‘‘గత 11 సంవత్సరాల్లో అమలు చేసిన సంస్కరణలు సహకారపూర్వక సమాఖ్యవాదానికి ఒక ప్రమాణచిహ్నంగా గనుల రంగాన్ని ఏ విధంగా రూపొందించాయో, కేంద్ర-రాష్ట్రాల సహకారాన్ని బలపరచడంతో పాటు పాలనను సమగ్రంగా మెరుగుపరిచాయో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి (@kishanreddybjp) తన వ్యాసంలో రాశారు’’ అని పేర్కొన్నారు.


(Release ID: 2138968)