ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లండన్‌లో వరల్డ్ టీమ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్.. బ్లిట్జ్ సెమీ ఫైనల్‌లో దివ్యా దేశ్‌ముఖ్ అద్భుత విజయం.. ప్రధానమంత్రి అభినందనలు

प्रविष्टि तिथि: 19 JUN 2025 2:00PM by PIB Hyderabad

లండన్‌లో నిర్వహించిన వరల్డ్ టీమ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా బ్లిట్జ్ సెమీ ఫైనల్‌ రెండో దశలో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి హోవు యిఫాన్‌పై చారిత్రక గెలుపును సాధించినందుకు దివ్యా దేశ్‌ముఖ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

‘‘లండన్‌లో నిర్వహించిన వరల్డ్ టీమ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా బ్లిట్జ్ సెమీ ఫైనల్‌ రెండో దశలో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి హోవు యిఫాన్‌ను ఓడించినందుకు దివ్యా దేశ్‌ముఖ్‌‌కు ఇవే అభినందనలుఆమె గెలుపు ఆమె ధైర్యాన్నీదృఢ సంకల్పాన్నీ చాటిచెబుతున్నదిఈ విజయం చాలా మంది వర్ధమాన చదరంగం క్రీడాకారులకు ప్రేరణను ఇస్తుందిరాబోయే కాలంలో ఆమె తన ప్రయత్నాల్లో రాణించాలని కోరుకుంటూఆమెకు నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.@DivyaDeshmukh05’’ 

 


(रिलीज़ आईडी: 2137666) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam