ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ సాంకేతిక వస్త్ర రంగం వేగవంతమైన వృద్ధిని ఎలా సాధిస్తోందీ వివరించిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
10 JUN 2025 12:39PM by PIB Hyderabad
జాతీయ సాంకేతిక వస్త్రాల మిషన్ (నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్..ఎన్టీటీఎం)తో పాటు, ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం వంటి ప్రభుత్వ కీలక కార్యక్రమాలు వెన్నుదన్నుగా నిలుస్తుండడంతో దేశంలో సాంకేతిక వస్త్రాల రంగం గొప్ప మార్పుల దశ గుండా ఎలా పయనిస్తోందీ వివరించిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు షేర్ చేశారు. ఈ ప్రయత్నాలు దేశీయ తయారీని పెంచుతూ, నవకల్పనకు ప్రోత్సాహాన్నివ్వడంతో పాటు ఎగుమతులు శరవేగంగా వృద్ధి చెందేటట్లు తోడ్పడుతున్నాయని, ఫలితంగా సాంకేతిక వస్త్రాల రంగంలో ప్రపంచంలో ఓ అగ్రగణ్య దేశంగా భారత్ పేరు తెచ్చుకొంటోందని శ్రీ మోదీ అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందిస్తూ:
‘‘జాతీయ సాంకేతిక వస్త్రాల మిషన్తో పాటు పీఎల్ఐ పథకం వంటి కీలక కార్యక్రమాలు అందిస్తున్న ఊతంతో భారత్ సాంకేతిక వస్త్ర రంగం వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ ప్రయత్నాలు తయారీని, నవకల్పనను, ఎగుమతులను పెంచుతూ, ఇండియాను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెడుతున్నాయని కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ @girirajsinghbjp రాశారు’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2135406)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam