ప్రధాన మంత్రి కార్యాలయం
సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం సహించదని స్పష్టం చేస్తూ రక్షణమంత్రి రాసిన వ్యాసాన్ని షేర్ చేసిన ప్రధానమంత్రి
Posted On:
07 JUN 2025 12:38PM by PIB Hyderabad
సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం సహించదని పునరుద్ఘాటిస్తూ రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ షేర్ చేశారు.
భారత్పై జరిగే ఏ దాడికైనా బలమైన ప్రతిస్పందన ఉంటుందని.. ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహించే నేరస్థులకు మధ్య ఎటువంటి తేడా చూపబోమని రక్షణ మంత్రి స్పష్టం చేసినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
పైన పేర్కొన్న వ్యాసం గురించి రక్షణ మంత్రి ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్కు స్పందిస్తూ శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
"సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం సహించదని రక్షణ మంత్రి శ్రీ @rajnathsingh పునరుద్ఘాటించారు. భారత్పై జరిగే ఏ దాడికైనా బలమైన ప్రతిస్పందన ఉంటుందని.. ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహించే నేరస్థులకు మధ్య ఎటువంటి తేడాను చూపబోమని ఆయన స్పష్టం చేశారు."
***
(Release ID: 2134944)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam