ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ పట్టణాభివృద్ధిని చాటే 20 ఏళ్ల ఉత్సవంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


ఉగ్రవాద కార్యకలాపాలు ఇక పరోక్ష యుద్ధం కాదు, అవి ప్రణాళికాబద్ధమైన వ్యూహాలు.. వాటికి అదే రీతిలో బదులిస్తాం

· ‘వసుధైవ కుటుంబం’ మన విశ్వాసం, ఎవ్వరితోనూ శతృత్వాన్ని కోరుకోం

· పురోగమిస్తాం.. ప్రపంచ శ్రేయస్సుకూ పాటుపడతాం

· 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్, ఇందులో రాజీ లేదు.. ప్రపంమంతా ‘వికసిత భారత్’ను ప్రశంసించేలా వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలు

· పట్టణ ప్రాంతాలు మనకు వృద్ధి కేంద్రాలు

· దాదాపు రెండు లక్షల అంకుర సంస్థలు: వాటిలో చాలావరకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే, అందునా ఎక్కువగా మహిళల నేతృత్వంలోనే...

· పెనుమార్పులను తేగల సమర్థత మనది.. ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు 140 కోట్ల ప్రజానీకం బాధ్యత

· గర్వంగా ప్రకటిద్దాం.. మన బ్రాండ్ ‘మేడ్ ఇన్ ఇండియా’: ప్రధాని

Posted On: 27 MAY 2025 2:33PM by PIB Hyderabad

గుజరాత్ పట్టణాభివృద్ధిని చాటే 20 ఏళ్ల వేడుకనుద్దేశించి గాంధీనగర్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారుపట్టణాభివృద్ధి సంవత్సరం2005కు ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణాభివృద్ధి సంవత్సరం-2025ను ఆయన ప్రారంభించారుసమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ.. వడోదరదాహోద్భుజ్అహ్మదాబాద్గాంధీనగర్‌లలో పర్యటన సందర్భంగా ఆపరేషన్ సిందూర్ విజయ గర్జనలురెపరెపలాడుతున్న మువ్వెన్నెల పతాకాలతో వెల్లివిరుస్తున్న దేశభక్తిని రెండు రోజులుగా ఆస్వాదిస్తున్నానన్నారుఈ కనువిందైన దృశ్యం ఒక్క గుజరాత్‌కే పరిమితం కాలేదనీ.. భారత్ నలుమూలలాప్రతి భారతీయుడి హృదయమూ ఇదే రకమైన భావనతో ఉప్పొంగుతోందని ఆయన పేర్కొన్నారుఉగ్రవాదమనే కంటకాన్ని నిర్మూలించాలని సంకల్పించిన భారత్ దృఢ నిశ్చయంతో దానిని నెరవేర్చింది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

దేశాన్ని మూడు భాగాలుగా విభజించిన వెంటనే 1947లోనే భారత్‌పై జరిగిన తొలి ఉగ్ర దాడి జరిగిందని శ్రీ మోదీ గుర్తుచేశారుఓ భాగంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిందని విమర్శించారుపాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు భారత సైన్యం ఆగవద్దన్న సర్దార్ పటేల్ లక్ష్యాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారుఅయితే ఆ సమయంలో పటేల్ సలహాను పాటించలేదన్నారుఈ ఉగ్రవాద వారసత్వమే 75 ఏళ్లుగా కొనసాగుతోందనిపహల్గాం దాడి దాని వికృత రూపమేనని శ్రీ మోదీ పేర్కొన్నారుదౌత్యపరమైన చర్యలతోపాటు యుద్ధంలో భారత సైనిక శక్తినీ ఎప్పటికప్పుడు పాకిస్థాన్ చవిచూస్తోందన్నారుమూడు సార్లూ భారత సాయుధ దళాలు పాకిస్థాన్‌ను నిశ్చయాత్మకంగా ఓడించాయనిప్రత్యక్ష సైనిక పోరాటంలో ఆ దేశం విజయం సాధించలేదని దీంతో స్పష్టమైందని అన్నారుబలహీనతను అంగీకరించిన పాక్ పరోక్ష యుద్ధానికి పాల్పడిందని శ్రీ మోదీ అన్నారుసైనిక తరహా శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌లో చొరబడి.. తీర్థయాత్రలకు వచ్చినవారినీనిరాయుధులైన అమాయక పౌరులనూ లక్ష్యంగా చేసుకున్నారని ఆయన వివరించారు.

భారత సాంస్కృతిక విలువలు అత్యున్నతమైనవన్నారుప్రపంచమంతటినీ కుటుంబంగా భావించే వసుధై కుటుంబమే మన తాత్వికత అని ప్రధానమంత్రి స్పష్టం చేశారుశతాబ్దాలుగా ఇదే సంప్రదాయాన్ని నిలబెట్టుకుంటున్న భారత్ పొరుగు దేశాలతో శాంతియుతసామరస్యపూర్వక సంబంధాలనే కాంక్షిస్తుందని పేర్కొన్నారుభారత్ ఎప్పుడూ శాంతినిస్థిరత్వాన్నే కోరుకుంటుందనీ.. కానీ పదే పదే ఎదురవుతున్న సవాళ్లతోవాటిని సమర్థంగా తిప్పికొట్టడం అనివార్యంగా మారిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుగతంలో పిలిచే పరోక్ష యుద్ధాల తీరు ప్రస్తుతంముఖ్యంగా మే సంఘటనల అనంతరం మారిందని ఆయన పేర్కొన్నారుఇటీవలి పరిణామాలను గమనిస్తే ఆ చర్యలను పరోక్ష యుద్ధమని చెప్పడం పొరపాటే అన్నారుఇకపై ఇది కేవలం పరోక్ష యుద్ధం మాత్రమే కాదనీ.. ఉద్దేశపూర్వకంగా పాకిస్థాన్ చేపట్టిన సైనిక వ్యూహంగా ఇటీవలి సంఘటనలతో తేటతెల్లమైందని స్పష్టం చేశారుతొమ్మిది ఉగ్రవాద స్థావరాలను గుర్తించిపూర్తి పారదర్శకతతోదేశీయంగా ఎలాంటి సందేహానికీ తావులేకుండా కెమెరా చిత్రీకరణతో 22 నిమిషాల్లోనే భారత్ వాటిని తుడిచిపెట్టిందని ఆయన తెలిపారుమే నాటి చర్యల అనంతరం పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అంత్యక్రియలు పూర్తి గౌరవలాంఛనాలతో జరిగాయనివారి శవపేటికలను జాతీయ జెండాలతో కప్పారనిఆ దేశ సైన్యమూ సెల్యూట్ చేసిందని ఆయన ఎత్తిచూపారుఇవి కేవలం ఉగ్రవాద కార్యకలాపాలే కాదనినిర్మాణాత్మక యుద్ధ విధానంలో భాగమని చెప్పడానికి ఆ చర్యలు స్పష్టమైన సంకేతాలుగా ఉన్నాయన్నారుఅలాంటి చర్యలకు పాల్పడితే నిశ్చయాత్మకంగా స్పందిస్తామని స్పష్టం చేశారు.

సంక్షోభ సమయాల్లో ఆపన్నహస్తాన్ని అందిస్తూ.. అందరి పురోగతినిసంక్షేమాన్నే భారత్ ఎల్లప్పుడూ కాంక్షించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారుఅయినా భారత్ చాలావరకు హింసాత్మక ప్రతీకార చర్యలను ఎదుర్కొన్నదని వ్యాఖ్యానించారుదశాబ్దాలుగా దేశం ఎలా నిర్లక్ష్యానికి గురయిందో యువతతరం గుర్తించాలని కోరారునిలిపివేసిన సింధూ నదీ జలాల ఒప్పందం గురించి మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌లో జల వనరులకు సంబంధించిన అంశాలను ప్రధానమంత్రి ఎత్తిచూపారునదులపై ఆనకట్టలు నిర్మించినప్పటికీసరైన నిర్వహణ లేకుండాపూడిక తీయకుండా అరవై ఏళ్లుగా వాటిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారునీటి నియంత్రణ కోసం ఉద్దేశించిన గేట్లు తెరవకుండానే ఉంచారనిదీనివల్ల పూర్తి వినియోగ స్థాయి నుంచి కేవలం రెండూ మూడు శాతానికే నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని ఆయన వ్యాఖ్యానించారున్యాయబద్ధమైన నీటి వాటా భారతీయులకు దక్కాలని స్పష్టం చేశారుమరియు ఇంకా ముఖ్యమైన చర్యలు తీసుకోవలసి ఉన్నప్పటికీప్రారంభ చర్యలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారుఈ దిశగా చర్యలు ఇప్పుడే మొదలయ్యాయనిఇంకా విశేషమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

ఎలాంటి శత్రుత్వాన్నీ భారత్ వాంఛించదనీ.. శాంతిశ్రేయస్సులనే దేశం కోరుకుంటోందని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. పురోగతికీఅంతర్జాతీయ శ్రేయస్సుకూ దేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారుభారత్ తన ప్రజల సంక్షేమానికి దృఢ సంకల్పంతో కట్టుబడి ఉందన్నారుమే 26వ తేదీని ప్రస్తావిస్తూ2014లో తాను ప్రధానమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారుఆ సమయంలో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉందికోవిడ్-19పై పోరాటంపొరుగు దేశాలతో ఇబ్బందులుప్రకృతి వైపరీత్యాల వంటి సవాళ్లను దేశం ఎదుర్కొన్నదన్నారుఎన్ని అడ్డంకులున్నా భారత్ శరవేగంగా ఆర్థిక వృద్ధిని సాధించి 11 నుంచి నాలుగో స్థానానికి ఎదిగిందని వివరించారుదేశ అభివృద్ధి లక్ష్యాన్నిపురోగతిపట్ల అచంచలమైన నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారుతన మూలాలు గుజరాత్‌లోనే ఉన్నాయని గుర్తుచేసుకుంటూ.. ఇక్కడ పెరిగిన తాను ఎన్నో పాఠాలువిలువలూ నేర్చుకున్నానన్నారుతమ ఆకాంక్షలను నెరవేర్చగలనన్న నమ్మకాన్ని ప్రజలు తనపై ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారువారి అభ్యున్నతి కోసం శ్రద్ధాసక్తులతో పనిచేస్తూనే ఉంటానని ప్రతినబూనారు.

పట్టణాభివృద్ధిపట్ల గుజరాత్ ప్రభుత్వ అంకితభావంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారురాష్ట్రం ఈ కార్యక్రమాన్ని 2005లో ప్రారంభించిందనిఇప్పుడు ఈ పురోగతికి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయని పేర్కొన్నారువిజయోత్సవాలకే పరిమితం కాకుండాగత 20 ఏళ్ల అనుభవాలతో తర్వాతి తరం కోసం భవిష్యత్ కేంద్రీకృతంగా తగిన పట్టణాభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందని ఆయన వివరించారుఇప్పుడు గుజరాత్ ప్రజల ముందుంచిన ఈ ప్రణాళిక సుస్థిర పురోగతి దిశగా నిర్మాణాత్మక లక్ష్యాలను సూచిస్తుందన్నారుభవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పట్టణాభివృద్ధి వ్యూహాన్ని రూపొందించడంలో అంకితభావంతో కృషిచేసిన రాష్ట్ర ప్రభుత్వాన్నిముఖ్యమంత్రినివారి బృందాన్ని ఆయన అభినందించారు.

భారత గణనీయమైన ఆర్థిక వృద్ధిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయ పోటీదారులను అధిగమించడం గర్వకారణమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆరు నుంచి అయిదో స్థానానికి చేరుకున్న వేళ దేశ ప్రజల్లోముఖ్యంగా యువతలో ఉత్సాహం వెల్లివిరిసిందని గుర్తుచేసుకున్నారుబ్రిటన్ వలస పాలనలో ఉన్న భారత్ ఆ దేశాన్ని అధిగమించడం చరిత్రాత్మకమైన విజయమని శ్రీ మోదీ చెప్పారుప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌పై.. త్వరలో మూడో స్థానానికి చేరుకోవాల్సిన బాధ్యత మరింత పెరుగుతోందని పేర్కొన్నారు2047 నాటికి భారత్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందనివందేళ్ల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని సంపన్నమైనశక్తిమంతమైన దేశంగా అంతర్జాతీయ గుర్తింపును పొందుతుందని ఆయన పునరుద్ఘాటించారుస్వాతంత్ర్యోద్యమాన్ని ప్రస్తావిస్తూ.. భగత్ సింగ్రాజ్‌గురునేతాజీ సుభాష్ చంద్రబోస్వీర సావర్కర్శ్యామ్‌జీ కృష్ణవర్మమహాత్మా గాంధీసర్దార్ పటేల్ వంటి నాయకుల త్యాగాలను శ్రీ మోదీ వివరించారునాటి 25-30 కోట్ల ప్రజలు దృఢనిశ్చయులై పోరాడి ఉండకపోతే.. 1947లో స్వాతంత్ర్యం సాధ్యం కాకపోయి ఉండేదేమో అన్నారుగత తరాలు 20-35 ఏళ్లలో వలస పాలకులను తరిమికొట్టగలిగాయనినేడు 140 కోట్ల ప్రజానీకం వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకోగలరని ఆయన స్పష్టం చేశారు2035ను దృష్టిలో ఉంచుకుని గుజరాత్ 75వ వార్షికోత్సవానికి ప్రణాళికలు రూపొందించడం అత్యావశ్యకమని శ్రీ మోదీ పేర్కొన్నారుపరిశ్రమలువ్యవసాయంవిద్యక్రీడల వంటి రంగాలలో రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఇప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాలని ఆయన ప్రముఖంగా సూచించారుదేశ వృద్ధి పథానికి అనుగుణంగా గుజరాత్ పురోగతి ఉండేలా సమష్టి సంకల్పంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు2036 లో ఒలింపిక్స్ నిర్వహించాలన్న భారత ఆకాంక్షలను కూడా ఆయన ప్రస్తావించారుఅంతర్జాతీయ నేతృత్వం దిశగా భారత సంసిద్ధతను ఇది స్పష్టం చేస్తోంది.

రాష్ట్రంగా ఏర్పడిననప్పటి నుంచి గుజరాత్ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రధానమంత్రి వివరించారుమొదట్లో రాష్ట్ర భౌగోళికఆర్థిక పరిమితులను ఎత్తిచూపుతూ గుజరాత్ అభివృద్ధి సమర్థతపై చాలామంది సందేహాలు లేవనెత్తారని ఆయన గుర్తుచేసుకున్నారుఉప్పు ఉత్పత్తికి పేరు పొందిన గుజరాత్ రాష్ట్రం నేడు వజ్రాల పరిశ్రమలో అంతతర్జాతీయంగా అగ్రగామిగా ఉందన్నారునిర్మాణాత్మక ప్రణాళికవ్యూహాత్మక కార్యక్రమాలే ఈ విజయానికి కారణమన్నారుపాలనపరమైన సవాళ్లను కూడా ప్రధానమంత్రి చర్చించారుప్రభుత్వ విభాగాలు విడివిడిగా ఉండడం చాలావరకు పురోగతికి ఆటంకం కలిగిస్తుందన్నారుప్రభుత్వ విభాగాల సమష్టి కృషితో కూడిన విధానం అత్యావశ్యకమనిఅందులో అన్ని మంత్రిత్వ శాఖల నడుమ సమర్థమైన సహకారానికి అవకాశముంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు2005లో పట్టణాభివృద్ధిమరో ఏడాది బాలికల విద్యమరో దశలో పర్యాటకం వంటి కేంద్రీకృత కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆయా సంవత్సరాలను కేటాయించిన గుజరాత్ నమూనాను ఆయన ఉదాహరించారు. ‘కుచ్ దిన్ తో గుజారో గుజరాత్ మే’ కార్యక్రమాన్ని ఆయన గుర్తు చేసుకున్నారుపర్యాటక రంగానికి ఊతమివ్వడంలో ఇది దోహదపడిందిదీని ద్వారా సోమనాథ్ద్వారకఅంబాజీ వంటి క్షేత్రాలు విశేషంగా అభివృద్ధి చెందాయిపట్టణాభివృద్ధిలోముఖ్యంగా అహ్మదాబాద్ విషయంలో తన అనుభవాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారుఅక్కడ రవాణా విస్తరణకు మొదట్లో ప్రతిఘటన ఎదురైందన్నారుఅహ్మదాబాద్‌లో ఎర్ర బస్సులను నగరం బయటా తిరిగేలా చేయడానికి ప్రయత్నించగా మొదట్లో అధికారుల నుంచీరాజకీయపరంగానూ అడ్డంకులు ఎదురయ్యాయని.. కానీ పట్టుదలతో ముందుకెళ్లడంతో మౌలిక సదుపాయాలు విశేషంగా అభివృద్ధి చెందాయని వివరించారుఅదేవిధంగా నగరవ్యాప్త అభివృద్ధి కోసం ఆక్రమణలను తొలగించడంలో ఎదురైన సవాళ్లను వివరించారుమొదట్లో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందనీఅయితే ప్రయోజనాలను చూసిన తర్వాత వారే విస్తృతంగా మద్దతిచ్చారని తెలిపారు.

గుజరాత్‌లో పట్టణ పునరుద్ధరణ చర్యలకు ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల నుంచిమీడియా నుంచి ఎదురైన విస్తృత ప్రతిఘటనను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారుఅయితేసమగ్రతతోప్రజా శ్రేయస్సే లక్ష్యంగా నాయకులు నిర్ణయాలు తీసుకుంటే.. దీర్ఘకాలిక ఫలితాలే వాటిని ధ్రువీకరిస్తాయని స్పష్టం చేశారుఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగులుతాయన్న భయం మొదట్లో ఉన్నప్పటికీపట్టణాల్లో సమూల మార్పుల దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ఎన్నికల్లో విజయాలతోపాటు విస్తృతమైన ప్రశంసలు కూడా లభించాయని శ్రీమోదీ చెప్పారునిరంతర పురోగతిపట్ల భారత నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారునాలుగో స్థానం నుంచి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్‌పై అంచనాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారుఆ ఆశయాలను దృఢ సంకల్పంతో కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

జనాభా పెరిగి విస్తరించడం కన్నా.. ఆర్థిక వృద్ధికి నిలయాలుగా పట్టణ కేంద్రాలు ఎదగాలని చెబుతూ.. ఆర్థిక కార్యకలాపాలకు నగరాలు క్రియాశీలమైన కేంద్రాలుగా ఉండాలిమార్పు దిశగా పురపాల సంస్థలు ప్రభావవంతమైన ప్రణాళికలు రూపొందించుకోవాల” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుదేశవ్యాప్తంగా మున్సిపల్మెట్రోపాలిటన్ అధికారులు తమ నగరాల కోసం ఆర్థిక వృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన కోరారుస్థానిక ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిని అంచనా వేసిఏడాది లోపు దానిని మెరుగుపరచడానికి వ్యూహాలను రూపొందించాలనిఇందుకోసం తయారీ వస్తువుల నాణ్యతను మెరుగుపరచడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలకు కొత్త మార్గాలను గుర్తించడంపై దృష్టి సారించాలని శ్రీ మోదీ సూచించారుకేవలం వాణిజ్య సముదాయాలను నిర్మించడం కన్నావ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు పట్టణ సంస్థలు చేయూతనివ్వాలనిస్థానిక మార్కెట్లలో వాటి విలువను మరింత పెంచేలా కార్యక్రమాల అమలు కోసం సమగ్ర అధ్యయనాలు నిర్వహించాలని పేర్కొన్నారుసాంప్రదాయకంగా పెద్ద పరిశ్రమలు మెట్రోపాలిటన్ ప్రాంతాల చుట్టూ పెరుగుతున్నప్పటికీదాదాపు రెండు లక్షల అంకుర సంస్థలు చాలావరకు ద్వితీయతృతీయ శ్రేణి నగరాల్లోనే ఉండడం విశేషమైన మార్పును సూచిస్తుందని ఆయన వ్యాఖ్యానించారువీటిలో చాలావరకు మహిళల నేతృత్వంలోనే ఉన్నాయని గర్వంగా ప్రకటించారుఆర్థికవ్యవస్థాపక విప్లవంలో ఇదొక విశేషమైన పరిణామమని పేర్కొన్నారువిద్యక్రీడల్లో కూడా ఇదే పురోగతిని గమనించవచ్చని శ్రీ మోదీ చెప్పారుపట్టణ ఆర్థిక వ్యవస్థలో మార్పులపై దృష్టి సారించడం వల్ల నాలుగో స్థానం నుంచి మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత ప్రయాణం వేగవంతమవుతుందన్నారుఈ విజయాన్ని సాధించడంలో స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం కీలకమని పునరుద్ఘాటించారు.  

పటిష్టమైన పాలనా నమూనా అవసరాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారుకొన్ని శక్తులు పాతుకుపోయిన మనస్తత్వాలతో చారిత్రాత్మకంగా భారతదేశ సామర్థ్యాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించాయనిసైద్ధాంతిక వ్యతిరేకత తరచూ అభివృద్ధి విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనకు దారితీసిందనిప్రతి కార్యక్రమాన్ని విమర్శించడం ఒక అలవాటుగా మారిపోయిందని ఆయన అన్నారుపట్టణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించిన ఆయనపరిపాలనలోని అడ్డంకులను అధిగమించడానికి ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమాన్ని (ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్)  ఎలా ప్రారంభించారో వివరించారుసుమారు 100 జిల్లాలను అభివృద్ధి సంబంధిత 40 ప్రమాణాలను ఆధారంగా తీసుకుని గుర్తించామని ప్రధాని పేర్కొన్నారుదీర్ఘకాలిక వ్యూహంతో ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారుఈ కార్యక్రమం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఆదర్శంగా మారిందనిసమర్థవంతమైన పాలనపై విలువైన సూచనలు అందిస్తున్నదని ఆయన అన్నారు.

ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడంలో టూరిజం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి స్పష్టం చేశారు., గుజరాత్ లో వచ్చిన మార్పును ఉదాహరణగా పేర్కొన్నారుఒకప్పుడు ఎడారి భూభాగం కారణంగా విస్మరించిన కచ్ ఇప్పుడు పర్యాటక కేంద్రంగా ఎలా మారిందో వివరించారుప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఏర్పాటు వంటి భారీ స్థాయి కార్యక్రమాలు కొత్త అవగాహనలను పెంపొందించాయనిప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చాయని ఆయన చెప్పారువడ్నగర్ వంటి ప్రాచీన ప్రాంతాలకు ఉన్న చారిత్రాత్మక ప్రాధాన్యతను కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారుఅక్కడి మ్యూజియాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వారసత్వ కేంద్రంగా ఆయన పేర్కొన్నారుభారత దేశ సముద్ర వారసత్వాన్ని ప్రస్తావిస్తూఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర చారిత్రక మ్యూజియాల్లో ఒకటైన లోథల్ గురించి ఆయన మాట్లాడారుగిఫ్ట్ సిటీ ఆలోచనను మొదట ప్రతిపాదించినప్పుడు ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయని,  అయితేఅది ఇప్పుడు ఆర్థిక కేంద్రాలకు ఒక ప్రమాణంగా మారిందని ప్రధాని చెప్పారువినూత్న ఆలోచనలను ధైర్యంతోవిశ్వాసంతో అమలు చేసినప్పుడే అర్థవంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారుసబర్మతి రివర్‌ఫ్రంట్ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నిర్మాణంస్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి అనేక విజయవంతమైన భారీ ప్రాజెక్టులను ప్రధాని ప్రస్తావించారుమార్పు తీసుకురాగల ప్రాజెక్టులను అమలు చేయడంలో భారత్ సామర్థ్యాన్ని ఇవి చాటుతున్నాయని ఆయన పేర్కొన్నారుదేశ భవిష్యత్తుపై తన అపార నమ్మకాన్ని ఆయన మరోసారి వ్యక్తం చేస్తూదేశం గణనీయమైన అభివృద్ధిని సాధించగలదన్న విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు.

గతంలో జరిగిన కార్యక్రమాలను పునఃసమీక్షించుకునే అవకాశం కల్పించిన గుజరాత్ ప్రభుత్వానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారుభారతదేశ అభివృద్ధిలో గుజరాత్ కీలక పాత్రను ప్రముఖంగా తెలిపారుదేశం కోసం ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడం కొనసాగించాలని ఆయన రాష్ట్రాన్ని కోరారు భారతదేశ ఉజ్వల భవిష్యత్తుపై తన నమ్మకాన్ని పునరుద్ఘాటించారు.

మే 6న ప్రారంభమైన ఆపరేషన్ సిందూర్ ప్రాముఖ్యతను వివరిస్తూఇది మొదట ఊహించిన పరిధిని మించిపోతుందనిదేశ అభివృద్ధికి జీవితాంత సంకల్పాన్ని ప్రతిబింబించే కార్యక్రమంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. 2047లో 100 సంవత్సరాల స్వాతంత్ర వేడుకల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న దృఢ సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారుప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న భారత్మూడో స్థానానికి ఎదగాలన్న లక్ష్యాన్ని ప్రధానమంత్రి వెల్లడించారుదీని కోసం విదేశీ ఉత్పత్తులపై ఆధారపడడాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారుప్రతి పౌరుడు తన దైనందిన వినియోగాన్ని పరిశీలించివిదేశీ వస్తువులను గుర్తించివాటికి బదులు స్థానికంగా తయారైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారుమతపరమైన పండుగల కోసం పూజలలో ఉపయోగించే విగ్రహాల వంటి సంప్రదాయ  వస్తువులను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉదాహరణలను ఆయన ప్రస్తావించారుదేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. "ఆపరేషన్ సిందూర్  కేవలం సైనిక చర్య మాత్రమే కాదుప్రతి భారతీయ పౌరుడు పంచుకునే బాధ్యతకూడాఅని శ్రీ మోదీ పునరుద్ఘాటించారుఆర్థిక స్వావలంబన ఆవశ్యకతను స్పష్టం చేస్తూస్థానిక తయారీకి ఊతమిచ్చేలా ప్రతి జిల్లాకు ప్రత్యేక ఉత్పత్తిని ప్రోత్సహించే ఒక జిల్లా – ఒక ఉత్పత్తి (వన్ డిస్ట్రిక్ట్వన్ ప్రొడక్ట్విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారుగతంలో విదేశీ వస్తువులపై ఆసక్తి ఎక్కువగా ఉండేదని ఆయన గుర్తు చేస్తూనేటి భారతదేశం ప్రపంచ స్థాయి ఉత్పత్తులను స్వదేశంలోనే తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారుదేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.

దేశ గౌరవాన్ని పెంపొందించే విధంగామేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల పట్ల గర్వించాలనిదేశం సాధించిన విజయాలను ఉత్సవంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి ప్రజలను కోరారుదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి,  ప్రపంచ స్థాయిలో దాని గుర్తింపు కోసం ప్రతి భారతీయుడు తన వంతు పాత్ర పోషించాలని పునరుద్ఘాటించారుపట్టణాభివృద్ధిలో గుజరాత్ ప్రభుత్వ నాయకత్వాన్నిదేశ మౌలిక సదుపాయాల వృద్ధికి మార్గదర్శక శక్తిగా గుజరాత్ నిర్వహించిన పాత్రను ప్రధాని అభినందించారు

గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్కేంద్ర మంత్రులు శ్రీ మనోహర్ లాల్,  శ్రీ సి.ఆర్పాటిల్,  ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నేపథ్యం

గుజరాత్‌లో “పట్టణాభివృద్ధి సంవత్సరం- 2025 ” అనే ప్రధాన కార్యక్రమాన్ని శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారుఈ కార్యక్రమం ద్వారా గుజరాత్‌లో పట్టణ మౌలిక వసతులుమెరుగైన పాలన,  పట్టణ వాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా గుజరాత్ ముఖచిత్రాన్ని మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారుఇప్పుడు ఈ కార్యక్రమానికి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగాప్రధానమంత్రి గాంధీనగర్ లో “పట్టణాభివృద్ధి సంవత్సరం 2025” ను,  గుజరాత్‌ కొత్త పట్టణాభివృద్ధి ప్రణాళిక నురాష్ట్ర  క్లీన్ ఎయిర్  కార్యక్రమాన్ని ప్రారంభించారుపట్టణ అభివృద్ధిఆరోగ్యంఆరోగ్య తాగునీటి సరఫరాకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలుశంకుస్థాపన చేశారుఅంతేకాకప్రధాని అవాస్ యోజన (పిఎంఎవైకింద నిర్మించిన 22,000కి పైగా గృహ యూనిట్లను అంకితం చేశారుగుజరాత్‌లోని పట్టణ స్థానిక సంస్థలకు “స్వర్ణిమ జయంతి ముఖ్యమంత్రి శహేరి వికాస్ యోజన”  కింద రూ.3,300 కోట్ల నిధులను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు.


(Release ID: 2131848)