ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్‌లోని మధుబనిలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ సంబంధిత కార్యక్రమంతో పాటు అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం‌

Posted On: 24 APR 2025 3:34PM by PIB Hyderabad

నేను నా ప్రసంగాన్ని మొదలుపెట్టడాని కన్నా ముందుమీకందరికీ ఒక వినతి చేస్తున్నాను... మీరు ఎక్కడ ఉన్న సరేమీరు కూర్చున్న చోటే.. లేచి నిలబడనక్కర లేదు... మనం కూర్చొని ఉండేఈ నెల 22న మనం కోల్పోయిన కుటుంబసభ్యులకు నివాళిని సమర్పిద్దాం... మీరు ఆసీనులై ఉన్న చోటు నుంచేకొన్ని క్షణాల పాటు మౌనాన్ని పాటించండి... మనం మన ఆరాధ్య దైవాలను స్మరించుకొంటూమొన్నటి మృతులందరికీ శ్రద్ధాంజలిని సమర్పిద్దాంఇది అయ్యాక, నేను నా నేటి ప్రసంగాన్ని మొదలుపెడతాను.

ఓం శాంతి శాంతి శాంతి.

బీహార్ గవర్నరు ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారుఇక్కడి జనప్రియ ముఖ్యమంత్రినా స్నేహితుడు శ్రీ నీతీశ్ కుమార్ జీవేదిక మీద ఉన్న ఇతర సీనియర్ ప్రముఖులుబీహార్‌కు చెందిన నా ప్రియమైన సోదరసోదరీమణులారా..

ఈ రోజుపంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగాదేశమంతా మిథిలతో ఉందంటే... బీహార్‌తోనూ ఉన్నట్లే. ఇవాళదేశాభివృద్ధికీబీహార్ ప్రగతికీ సంబంధించిన వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టులకు ఇక్కడ శంకుస్థాపనప్రారంభోత్సవాలు అయ్యాయివిద్యుత్తురైలుమార్గాలుమౌలిక సదుపాయాలకు చెందిన వివిధ పనులు బీహార్‌లో కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించనున్నాయిఈ రోజు జాతీయ కవి రాంధారీ సింగ్ దినకర్ జీ వర్ధంతి కూడాఆయనకు నేను నా వినమ్ర నివాళిని అర్పిస్తున్నాను.

మిత్రులారా,

పూజ్య బాపూ సత్యాగ్రహ మంత్రాన్ని వ్యాప్తిలోకి తీసుకువచ్చింది బీహార్ నుంచేభారత్‌లో పల్లెలలు బలమైవిగా మారకపోతేభారత్ శరవేగంగా పురోగమించలేదని పూజ్య బాపూ గట్టిగా నమ్మారుదేశంలో పంచాయతీ రాజ్ భావన వెనుక ఉన్న స్ఫూర్తి ఇదేవెనుకటి పదేళ్లలోపంచాయతీలకు సాధికారతను కల్పించడానికి ఒకదాని తరువాత మరొకటిగా అనేక చర్యలు తీసుకున్నాంటెక్నాలజీ ద్వారా కూడా పంచాయతీలను బలపరిచాంగడచిన దశాబ్ద కాలంలోఇంటర్‌నెట్‌తో లక్షలకు పైగా పంచాయతీల్ని కలిపాం.  

పల్లెల్లో అయిదున్నర లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్లను నిర్మించారుపంచాయతీలు డిజిటలీకరణకు నోచుకొన్నందువల్ల మరో ప్రయోజనం కూడా ఉందిజీవన ప్రమాణమరణ ధ్రువపత్రాలుభూ యాజమాన్య ధ్రువపత్రాలుఆ తరహా దస్తావేజులను మరెన్నింటినో పొందవచ్చునుస్వాతంత్ర్యం వచ్చిన అనేక దశాబ్దాలకుదేశంలో 30 వేల కొత్త పంచాయతీ భవనాలను నిర్మించారుపంచాయతీలకు సరిపడ నిధులు లభించేటట్టు చూడాలనేది సైతం ప్రభుత్వ ప్రాథమ్యంగా ఉండిందిపోయిన పది సంవత్సరాల్లో, 2 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ నిధులను పంచాయతీలు అందుకున్నాయిఈ డబ్బునంతా గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఖర్చుపెట్టారు.  

మిత్రులారా,

గ్రామ పంచాయతీల్లో మరో ప్రధాన సమస్య భూమి వివాదాలకు సంబంధించిందిఏది నివాస భూమిఏది సాగు భూమిఏది పంచాయతీ భూమిఏది ప్రభుత్వ భూమి అనే విషయాల్లో తరచుగా వివాదాలు తలెత్తుతూ వచ్చాయిదీనిని పరిష్కరించడానికిభూమిని డిజిటలీకరించాంభూమి రికార్డుల డిజిటలీకరణ అనవసర తగాదాలను చక్కదిద్దడంలో సహాయపడింది.

మిత్రులారా,

పంచాయతీలు సామాజిక ప్రాతినిధ్యానికి ఎలా ఊతాన్నిచ్చాయో మనమంతా గమనించాంపంచాయతులలో 50 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పించిన మొదటి రాష్ట్రం బీహారేఈ కారణంగా నేను నితీశ్ జీని అభినందిస్తున్నాను.

ప్రస్తుతం... పేదదళితమహా దళితవెనుకబడిన సముదాయాలతో పాటు మరీ వెనుకబడిపోయిన వర్గాలకు చెందిన సోదరీమణులుపుత్రికలు బీహార్‌లో ప్రజా ప్రతినిధులుగా సేవచేస్తున్నారుఇదే నిజమైన సామాజిక న్యాయంసిసలైన సామాజిక ప్రాతినిధ్యంఎక్కువ మంది పాల్గొంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందిబలపడుతుందిమదిలో ఈ ఆలోచనతోనేలోక్‌సభలోనూవిధానసభలోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉండాలన్న చట్టాన్ని కూడా తీసుకువచ్చాందీనివల్ల దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలోని మహిళలకు మేలు కలుగుతుంది...  మన అక్కచెల్లెళ్లతో పాటు కుమార్తెలకు కూడా మరింత ప్రాతినిధ్యం లభిస్తుంది.

మిత్రులారా,

దేశంలో మహిళలకు ఆదాయాన్ని పెంచడానికీఉద్యగావకాశాలతోపాటు స్వతంత్రోపాధి అవకాశాల్ని సృష్టించడానికీ ప్రభుత్వం ఉద్యమ తరహాలో పనిచేస్తోందిబీహార్‌లో నడుపుతున్న జీవికా దీదీ కార్యక్రమం చాలా మంది సోదరీమణుల జీవనాన్ని ఉద్ధరించిందిఈ ఒక్క రోజులోనేసుమారు ఒక వేయి కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని బీహార్‌లో సోదరీమణుల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు అందజేశాంఇది సోదరీమణుల ఆర్థిక సాధికారితను మరింత పెంచుతుందిఇది దేశంలో మూడు కోట్ల మంది సోదరీమణులను ‘లఖ్పతీ దీదీలు’గా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని సాధించడంలో మరింత తోడ్పాటును అందించనుంది.

మిత్రులారా,

గడచిన పదేళ్ల కాలంలోగ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇదివరకెరుగని వేగాన్నందుకుందిపల్లెల్లో పేదల కోసం ఇళ్లను నిర్మించారురోడ్లు వేశారుకాంక్రీటు దారులు పరిచారుపల్లెల్లో గ్యాస్ కనెక్షన్లనునీటి కనెక్షన్లను ఇచ్చారుటాయిలెట్లను కట్టారుఇలాంటి ప్రతి పనినీ చేపట్టడం వల్ల లక్షల కోట్ల రూపాయలు పల్లెలకు అందాయికొత్త ఉద్యోగావకాశాలను సైతం కల్పించారుశ్రామికుల మొదలు రైతుల వరకుబండి నడిపే వారు మొదలు దుకాణదారుల వరకు.. ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదనకు కొత్త అవకాశాలంటూ లభించాయిఇది సమాజానికి ఎంతో లాభదాయకంగా ఉంది... ఈ మేలు కొన్ని తరాల తరబడి కలగనే లేదునేను మీకు ‘పీఎం ఆవాస్ యోజన’ను గురించిన ఉదాహరణను చెబుతానుదేశంలో ఏ పేద కుటుంబమూ తలపై నీడ లేకుండా మిగిలిపో కూడదు. ప్రతి ఒక్కరికీ తల దాచుకోవడానికంటూ ఒక పక్కా వసతి లభించాలన్నదే ఈ పథకం ధ్యేయంకాసేపటి కిందటేనేను ఇక్కడున్న మాతృమూర్తులకుసోదరీమణులకు వారి ఇళ్ల తాళంచెవుల్ని అందజేస్తున్నప్పుడు వారి ముఖాల్లో కనిపించిన సంతోషం... వారిలో ఉట్టిపడుతున్న సరికొత్తదైన ఆత్మవిశ్వాసం.. నిజంగా ఇవేఈ పేదల కోసం పని  చేయాలన్న ప్రేరణకు కారణమయ్యాయిమరి ఈ లక్ష్యాన్ని మనసులో పెట్టుకొనేపోయిన పదేళ్లలో కోట్లకు పైగా కాంక్రీటు ఇళ్లను నిర్మించాంబీహార్‌లో సైతంఇంతవరకు 57 లక్షల పేద కుటుంబాలు పక్కా ఇళ్లను పొందాయిఈ గృహాలను పేదలకుదళితులకువెనుకబడిన వర్గాలుమరీ వెనుకబడిపోయిన వర్గాల వారికీపస్‌మాందా పరివారాలకూసమాజంలో వంచనకు గురైనటువంటి సమాజాల్లోని కుటుంబాలకూ ఇచ్చారురాబోయే సంవత్సరాల్లోమరో కోట్ల పక్కా ఇళ్లను పేదలకు ఇవ్వబోతున్నారుఇవాళసుమారు ఒకటిన్నర లక్షల బీహార్ కుటుంబాలు కొత్తగా నిర్మించిన పక్కా ఇళ్లలోకి అడుగుపెడుతున్నాయిదేశం నలుమూలలా 15 లక్షల మంది పేదలకు నూతన గృహాలను నిర్మించాలంటూ మంజూరు లేఖలను అందజేశాంఈ కుటుంబాల్లోమూడున్నర లక్షల మంది లబ్ధిదారులు ఒక్క బీహార్‌లోనే ఉన్నారుఈ ఒక్క రోజులోనేఇంచుమించు 10 లక్షల మంది పేద కుటుంబాలకు కాంక్రీటు ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించాంఈ కుటుంబాల్లో బీహార్ ‌కు చెందిన 80 వేల కుటుంబాలతో పాటు పట్టణ ప్రాంతాలకు చెందిన ఒక లక్ష కుటుంబాలు కూడా ఉన్నాయి.‌‌

 

***


(Release ID: 2124253)