సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ 2025 గురించి వార్తా సంస్థలతో సమావేశమైన కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్
వేవ్స్ను పరిశ్రమే నిర్వహిస్తోంది.. ప్రభుత్వం ఒక ఉత్ప్రేరకం మాత్రమే: అశ్విని వైష్ణవ్
భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ ఊతానికి మంచి స్పందన: 1 లక్ష కంటే రిజిస్ట్రేషన్లు, నైపుణ్యాలను ప్రదర్శించనున్న 750 మంది ఉన్నత స్థాయి క్రియేటర్లు
అందరూ ఉపయోగించదగిన సృజనాత్మక పరిష్కారాల కోసం క్రియేటర్లు, కొనుగోలుదారులు, మార్కెట్ల మధ్య ప్రపంచ స్థాయి అనుసంధాన వేదికగా ఎదుగుతోన్న వేవ్స్ : కేంద్ర మంత్రి
Posted On:
19 APR 2025 7:03PM
|
Location:
PIB Hyderabad
క్రియేటర్ల ప్రపంచం, వారికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ మౌలికమైన మార్పుకు లోనవుతోంది. మే 1 నుంచి 4 వరకు ముంబయిలో జరగనున్న తొలి ప్రపంచ దృశ్య శ్రవణ వినోద సదస్సును పురస్కరించుకొని ముందస్తుగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈ రోజు మీడియాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సుమారు 20 జాతీయ, ప్రాంతీయ స్థాయి మీడియా సంస్థలు పాల్గొన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం రాకతో పాత నమూనాలు కొత్త నమూనాలకు దారితీస్తున్నాయని, నూతన సవాళ్లను సృష్టిస్తున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. మీడియా ప్రపంచం రూపురేఖలు మారిపోతున్నాయని, కొత్త నమూనాకు ప్రతిస్పందించాల్సిన దేశంగా ఉన్న సమిష్టి అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కంటెంట్ సృష్టించేందుకు పెద్ద స్టూడియోలు అవసరమయ్యే రోజులు పోయాయని అంటూ ఒక ఉదాహరణ చెప్పారు. నేడు జార్ఖండ్ లేదా కేరళలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక సృష్టికర్త మంచి నాణ్యతతో సృష్టించి, మిలియన్ల మంది చూసేలా చేయగలడని వివరించారు.

క్రియేటర్ ఆర్థికవ్యవస్థ విపరీతంగా పెరుగుతోందని అన్నారు. మన దార్శనిక ప్రధాన మంత్రి ప్రపంచవ్యాప్తంగా భారత మృదు శక్తిని ప్రోత్సహించడం ద్వారా సృష్టికర్తల కృషిని, ఆర్థిక వ్యవస్థలో వారి సహకారాన్ని గుర్తించారని మంత్రి అన్నారు. ఆర్థిక విధానాలకు దావోస్ ప్రపంచ వేదికగా ఉన్నట్లే మీడియా, వినోదానికి ప్రపంచ స్థాయి వేదికగా ఎదగాలని వేవ్స్ భావిస్తోందన్నారు.
వేవ్స్ 2025కు లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు రావటంతో భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు భారీ ఊపు లభించింది. వర్ధమాన ప్రపంచ మీడియా, వినోద రంగంలో చేసిన కృషిని గుర్తిస్తూ ఉత్తమ ఆవిష్కర్తలను అవార్డులతో సత్కరించనున్నారు. ప్రపంచాన్ని మన సృష్టికర్తలతో అనుసంధానించడానికి ఒక మార్గాన్ని కనుగొంటున్నాం అని అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. సృజనాత్మక పరిష్కారాల కోసం క్రియేటర్లు, కొనుగోలుదారులు, మార్కెట్ల మధ్య ప్రపంచ స్థాయి అనుసంధాకర్తగా వేవ్స్ ఎదుగుతోందని మంత్రి తెలిపారు. వేవ్స్లో సృష్టికర్తలు తమ కంటెంట్ను వివిధ సంస్థలకు అందించవచ్చు. వివిధ సంస్థలు వాటిని తీసుకోవచ్చు. మొత్తంగా వేవ్స్ కొనుగోలుదారులు, అమ్మకందారులకు ఒక వేదికను అందిస్తోంది.
ఎంఅండ్ఈ రంగంలోని విధాన నిర్ణేతలు, సృష్టికర్తలు, పారిశ్రామిక దిగ్గజాలు, సాంకేతిక దిగ్గజాలు, అంకురాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి వేవ్స్ రూపంలో వినూత్న కార్యక్రమాన్ని రూపొందించినందుకు వివిధ మీడియా సంస్థల అధిపతులు ప్రభుత్వాన్ని అభినందించారు.
మీడియా భవిష్యత్తును రూపొందించడంలో సమిష్టి కృషికి ప్రాముఖ్యతను తెలియజేసేలా.. సమావేశానికి హజరైన నిపుణులు, ప్రముఖులందరికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు స్వాగతం పలికారు. అన్ని విభాగాల భాగస్వాములను నిమగ్నం చేసే విషయంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఆయన ప్రధానంగా చెప్పారు. వేవ్స్ 2025 ముందస్తు కార్యక్రమాల్లో మీడియా సంస్థలు చురుగ్గా పాల్గొనటాన్ని ఆయన ప్రశంసించారు.
***
Release ID:
(Release ID: 2122966)
| Visitor Counter:
43
Read this release in:
Odia
,
English
,
Gujarati
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam