ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిన్లాండ్ అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ స్టబ్ తో ఫోన్ లో సంభాషించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
ద్వైపాక్షిక సహకారంపై సమీక్ష.. భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై నిబద్ధతను
పునరుద్ఘాటించిన ఇరువురు నేతలు
ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చ
Posted On:
16 APR 2025 5:45PM by PIB Hyderabad
ఫిన్లాండ్ అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ స్టబ్తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో మాట్లాడారు.
డిజిటలీకరణ, సుస్థిరత, మొబిలిటీ సహా వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంపై నేతలిద్దరూ సమీక్షించారు. క్వాంటం, 5జీ-6జీ, ఏఐ, సైబర్ భద్రత రంగాలు సహా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తమ అంకితభావాన్ని పునరుద్ఘాటించారు.
ఉక్రెయిన్ పరిస్థితి సహా ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా వారిద్దరూ చర్చించారు. భారత్ – ఈయూ మధ్య మరింత సన్నిహిత సంబంధాలతోపాటు ఉమ్మడి ప్రయోజనాలున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై వీలైనంత త్వరగా అనిశ్చితిని తొలగించడానికి ఫిన్లాండ్ సహకరిస్తుందని అధ్యక్షుడు స్టబ్ వెల్లడించారు.
సంప్రదింపులను కొనసాగించడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు.
(Release ID: 2122273)
Visitor Counter : 26
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam