ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హర్యానాలో హిసార్ విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 14 APR 2025 12:58PM by PIB Hyderabad

నేను బాబాసాహెబ్ అంబేద్కర్ అంటానుమీరంతా రెండుసార్లు చెప్పండి -  అమర్ రహేఅమర్ రహే! (దీర్ఘాయుష్షుదీర్ఘాయుష్షు!)

బాబాసాహెబ్ అంబేద్కర్అమర్ రహేఅమర్ రహే!

బాబాసాహెబ్ అంబేద్కర్అమర్ రహేఅమర్ రహే!

బాబాసాహెబ్ అంబేద్కర్అమర్ రహేఅమర్ రహే!

హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీకేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ మురళీధర్ మొహోల్హర్యానా ప్రభుత్వంలోని మంత్రులూఎంపీలుఎమ్మెల్యేలునా ప్రియమైన సోదరసోదరీమణులారా 

ధైర్యవంతులైన మన హర్యానా ప్రజలకు రామ్ రామ్!

దృఢమైన సైనికులుదృఢమైన ఆటగాళ్ళుగొప్ప సోదరభావంఇదే హర్యానా గుర్తింపు!

హడావిడిగా ఉండే ఈ లావణి పండుగ సమయంలో మీరు ఇంత భారీ సంఖ్యలో వచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు మీ అందరికి నా హృదయపూర్వక అభినందనలుఅలాగే గురు జంభేశ్వర్మహారాజా అగ్రసేన్అగ్రోహా ధామ్‌లకు కూడా నా నివాళులు అర్పిస్తున్నాను.

మిత్రులారా,

హర్యానాలోని హిసార్ నుంచి నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయిభారతీయ జనతా పార్టీ నాకు హర్యానా బాధ్యతలు అప్పగించినప్పుడునేను ఇక్కడ చాలా మంది సహచరులతో కలిసి చాలా కాలం పనిచేశానుఈ సహచరులందరి కృషి హర్యానాలో భారతీయ జనతా పార్టీ పునాదిని బలోపేతం చేసిందిఅభివృద్ధి చెందిన హర్యానాఅభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా బిజెపి పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తుండటాన్ని చూసి నేను గర్వపడుతున్నాను.

మిత్రులారా,

మనందరికీయావత్ దేశానికిముఖ్యంగా దళితులకుఅణగారిన వర్గాలకుఅవకాశాలకు దూరమైపోయిన వారికిదోపిడీకి గురైన వారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజువారి జీవితంలో ఇది రెండో దీపావళినేడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిఆయన జీవితంఆయన పోరాటంజీవిత సందేశం ఇవన్నీ మా ప్రభుత్వ పదకొండేళ్ల ప్రయాణానికి స్ఫూర్తిగా మారాయిప్రతిరోజూప్రతి నిర్ణయంప్రతి విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ కే అంకితంఅణగారినఅణచివేతకు గురైనదోపిడీకి గురైనపేదగిరిజనమహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చి వారి కలలను నెరవేర్చడమే  మా లక్ష్యంఇందుకోసం నిరంతర అభివృద్ధివేగవంతమైన అభివృద్ధి అనేది బిజెపి ప్రభుత్వ మంత్రం.

మిత్రులారా,

ఈ మంత్రాన్ని అనుసరించి నేడు హర్యానా నుంచి అయోధ్య ధామ్ కు విమానం బయలుదేరిందిఅంటే ఇప్పుడు శ్రీకృష్ణుని పవిత్ర భూమి నేరుగా శ్రీరాముడి నగరంతో ముడిపడిందిఅగ్రసేన్ విమానాశ్రయం నుంచి వాల్మీకి విమానాశ్రయానికి ఇప్పుడు నేరుగా విమానాలు నడుపుతున్నారుత్వరలో ఇతర నగరాలకు కూడా ఇక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయిఈ రోజు హిసార్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి  శంకుస్థాపన కూడా జరిగిందిహర్యానా ఆకాంక్షలను కొత్త ఎత్తుకు తీసుకెళ్లడానికి ఇది నాందిఈ కొత్త ప్రారంభానికి గానూ హర్యానా ప్రజలను నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా,

సాధారణ పాదరక్షలు ధరించేవారు కూడా విమానంలో ప్రయాణం చేస్తారని నేను మీకు వాగ్దానం చేశానుఈ హామీ దేశవ్యాప్తంగా నెరవేరుతున్నట్టు మనం చూస్తున్నాంగత పదేళ్లలో కోట్లాది మంది భారతీయులు తమ జీవితంలో తొలిసారిగా విమాన ప్రయాణం చేశారుమంచి రైల్వేస్టేషన్లు లేని చోట్ల కూడా కొత్త విమానాశ్రయాలు నిర్మించాం. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలు ఉండేవిఒక్కసారి ఊహించుకోండి, 70 ఏళ్లలో 74 విమానాశ్రయాలు ఉంటే నేడు దేశంలో విమానాశ్రయాల సంఖ్య 150 దాటిందిదేశంలోని దాదాపు 90 విమానాశ్రయాలను ఉడాన్ యోజనతో అనుసంధానం చేశారుఉడాన్ యోజన కింద 600కు పైగా రూట్లలో విమాన సర్వీసులు నడుస్తున్నాయిప్రజలు చాలా తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేస్తున్నారువిమాన ప్రయాణికుల సంఖ్యలో ప్రతి సంవత్సరం కొత్త రికార్డు నమోదవుతోందిమన విమానయాన సంస్థలు కూడా రికార్డు స్థాయిలో రెండు వేల కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చాయికొత్త విమానాలు ఎంత ఎక్కువ వస్తే పైలట్లుఎయిర్ హోస్టెస్  ఉద్యోగాలు అంత ఎక్కువగా వస్తాయివందలాది కొత్త సర్వీసులు కూడా ప్రారంభం అయ్యాయిఒక విమానం ఎగిరితే గ్రౌండ్ స్టాఫ్ తో పాటు ఎన్నో ఉద్యోగాలు ఉంటాయిఇలాంటి అనేక సేవలతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయిఅంతే కాదు విమానాల నిర్వహణకు సంబంధించిన పెద్ద రంగం కూడా లెక్కలేనన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందిహిసార్ లోని ఈ విమానాశ్రయం హర్యానా యువత కలలకు కొత్త రెక్కలు ఇస్తుంది.

మిత్రులారా,

మా ప్రభుత్వం ఒకవైపు కనెక్టివిటీకి పెద్దపీట వేస్తూనే మరోవైపు పేదల సంక్షేమంసామాజిక న్యాయానికి కూడా అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందిఇది బాబాసాహెబ్ అంబేద్కర్ కలఇది మన రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షఇది దేశం కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడిన వారి కల కూడా.  కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరును మనం ఎప్పటికీ మరచిపోకూడదుబాబాసాహెబ్ బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఆయనను అవమానించిందిఆయనను రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారుమొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను గద్దె దించే పనిలో నిమగ్నమైందిఆయనను వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు కుట్ర పన్నారుబాబాసాహెబ్ మన మధ్య లేనప్పుడు ఆయన జ్ఞాపకాలను కూడా చెరిపేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందిబాబాసాహెబ్ ఆలోచనలను శాశ్వతంగా నాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందిఅంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షకుడు అయితే కాంగ్రెస్ ఆ రాజ్యాంగ వినాశకారిగా మారిందిడాక్టర్ అంబేద్కర్ సమానత్వాన్ని తీసుకురావాలనుకున్నారుకానీ కాంగ్రెస్ దేశంలో ఓటు బ్యాంకుల వైరస్ ను వ్యాప్తి చేసింది.

మిత్రులారా,

ప్రతి పేదవాడుఅణగారిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించగలగాలని,  తల పైకెత్తి జీవించాలనివారు కూడా కలలు కనాలనిఆ కలలను నెరవేర్చుకోవాలని బాబాసాహెబ్ కోరుకున్నారుకానీ కాంగ్రెస్ ఎస్సీఎస్టీఓబీసీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిందికాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో ఆ పార్టీ నాయకుల స్విమ్మింగ్ పూల్స్ లోకి నీరు చేరేది తప్ప గ్రామాల్లో కుళాయి నీళ్లు ఉండేవికావుస్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకు కూడా గ్రామాల్లో కేవలం 16 శాతం ఇళ్లకు మాత్రమే కుళాయి నీరు ఉందిఅంటే, 100 ఇళ్లలో 16 -  ఊహించండిదీని వల్ల ఎవరు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారుఎస్సీఎస్టీఓబీసీలే ఎక్కువగా ప్రభావితమయ్యారుఈ రోజు వీధి నుంచి వీధికి వెళ్లి ఉపన్యాసాలు ఇస్తున్న వారు కనీసం ఎస్సీఎస్టీఓబీసీ సోదరుల ఇళ్లకు నీళ్లు అందించి ఉండాల్సిందిమా ప్రభుత్వం 6-7 ఏళ్లలో 12 కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చిందినేడు గ్రామంలోని 80 శాతం ఇళ్లలోఅంటే గతంలో 100కు 16 ఇళ్లలో అయితేనేడు 100 ఇళ్లలో 80 ఇళ్లకు కుళాయి నీరు ఉందిబాబాసాహెబ్ ఆశీస్సులతో ఇంటింటికీ కుళాయి నీటిని అందిస్తాంమరుగుదొడ్ల విషయంలో కూడా ఎస్సీఎస్టీఓబీసీ వర్గాల పరిస్థితి దయనీయంగా ఉండేదిమా ప్రభుత్వం 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించి నిరుపేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించింది

మిత్రులారా,

కాంగ్రెస్ హయాంలో ఎస్సీఎస్టీఓబీసీలకు బ్యాంకులు తలుపులు కూడా తెరిచేవి కావుబీమారుణాలుఆర్థిక సహాయం ఇలా అన్నీ ఒక కలగాఉండేవికానీఇప్పుడు జన్ ధన్ ఖాతాల ద్వారా ఎక్కువగా లబ్దిపొందుతున్నది ఎస్సీఎస్టీఓబీసీ సోదరసోదరీమణులేనేడు మన ఎస్సీఎస్టీఓబీసీ సోదరసోదరీమణులు సగర్వంగా తమ రూపే కార్డులను జేబులోంచి తీసి చూపిస్తున్నారుఒకప్పుడు ధనవంతుల జేబుల్లో ఉండే రూపే కార్డులను ఇప్పుడు మన పేదలు చూపిస్తున్నారు.

మిత్రులారా,

అధికారం కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అస్త్రంగా మార్చుకుందికాంగ్రెస్ అధికార సంక్షోభాన్ని చూసినప్పుడల్లా రాజ్యాంగాన్ని అణచివేసిందిఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ తన అధికారాన్ని నిలుపుకోవడానికి రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా తుంగలో తొక్కింది.  ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన పౌర స్మృతి ఉండాలనేది రాజ్యాంగ స్ఫూర్తిదీనిని నేను సెక్యులర్ సివిల్ కోడ్ అని పిలుస్తానుకానీ కాంగ్రెస్ దానిని ఎప్పుడూ అమలు చేయలేదుఉత్తరాఖండ్ లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్యులర్ సివిల్ కోడ్యూనిఫాం సివిల్ కోడ్ ను  అమలు చేసిన ఘనత సాధించిందికానీ ఈ దేశం దురదృష్టం ఏమిటంటే — జేబులో రాజ్యాంగాన్ని పెట్టుకుని తిరిగే వారురాజ్యాంగంపై కూర్చున్నవారుఅంటే ఈ కాంగ్రెస్ నాయకులు — దానికి కూడా వ్యతిరేకించారు

మిత్రులారా,

మన రాజ్యాంగం ఎస్సీఎస్టీఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించిందికానీ కాంగ్రెస్ వారికి రిజర్వేషన్లు కల్పించారో లేదోవారి పిల్లలకు విద్యావకాశాలు లభిస్తున్నాయో లేదోఎస్సీఎస్టీఓబీసీలు ఎవరైనా తమ హక్కులను కోల్పోయారో లేదో ఎన్నడూ పట్టించుకోలేదుకానీ రాజకీయ క్రీడలు ఆడేందుకు కాంగ్రెస్ బాబా సాహెబ్ అంబేద్కర్ కలనుసామాజిక న్యాయం కోసం రాజ్యాంగంలో చేసిన నిబంధనను వెన్నుపోటు పొడిచిఆ రాజ్యాంగాన్ని బుజ్జగింపు రాజకీయానికి ఒక సాధనంగా మార్చిందికర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీఎస్టీఓబీసీల హక్కులను కాలరాసిందిటెండర్లలో మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించిందని మీరు ఇటీవల వార్తల్లో వినే ఉంటారుఅయితే బాబా సాహెబ్ రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించబోమనిమన రాజ్యాంగం మతం ఆధారంగా రిజర్వేషన్లను నిషేధించిందని స్పష్టంగా చెప్పారు.

మిత్రులారా,

కాంగ్రెస్ ఈ బుజ్జగింపు విధానం వల్ల ముస్లిం సమాజం కూడా తీవ్రంగా నష్టపోయిందికాంగ్రెస్ కొద్దిమంది ఛాందసవాదులను మాత్రమే సంతోషపెట్టిందిసమాజంలో మిగిలినవారు నిస్సహాయులుగా,  నిరక్షరాస్యులుగానిరుపేదలుగా మిగిలిపోయారుకాంగ్రెస్  దుర్మార్గపు విధానానికి అతిపెద్ద నిదర్శనం వక్ఫ్ చట్టమేదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 2013 వరకు వక్ఫ్ చట్టం అమల్లో ఉన్నా ఎన్నికల్లో గెలవడానికిబుజ్జగింపు రాజకీయాలకుఓటు బ్యాంకు రాజకీయాలకు వీలుగా 2013 చివరిలోపార్లమెంట్ చివరి సెషన్లోఎన్నికలలో ఓట్లు పొందడానికి కాంగ్రెస్ చాలా హడావుడిగా ఎంతోకాలంగా అమల్లో ఉన్న వక్ఫ్ చట్టాన్ని సవరించిందిఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నాశనం చేసే విధంగారాజ్యాంగానికి అతీతంగా ఈ చట్టాన్ని రూపొందించారుఇది బాబాసాహెబ్ కు జరిగిన అతి పెద్ద అవమానం.

మిత్రులారా,

ముస్లింల ప్రయోజనాల కోసమే తాము ఈ పని చేశామని వారు చెబుతున్నారువారందరినీ నేను అడగాలనుకుంటున్నానుఈ ఓటు బ్యాంకు దాహం ఉన్న రాజకీయ నాయకులకు నేను చెప్పాలనుకుంటున్నానుమీ హృదయంలో నిజంగా ముస్లింల పట్ల చిన్న సానుభూతి ఉంటేకాంగ్రెస్ పార్టీ ఒక ముస్లింను ఎందుకు అధ్యక్షుడిని చేయదు వారు పార్లమెంటు టిక్కెట్లు ఇచ్చిఅందులో 50% ముస్లింలకి కేటాయిస్తారుగెలిస్తే తమ మాట నెగ్గించుకోవాలని చూస్తారుకానీ వారికి అలా చేయాలని లేదువారికి దేశం నుంచి ప్రజల నుంచి హక్కులు లాక్కోవడంపంచడం తప్ప ఎవరికీ మంచి చేసే ఆలోచన లేదుకనీసం ముస్లింలకైనా సరేకాంగ్రెస్ గురించి ఇదే అసలైన నిజం.

మిత్రులారా,

దేశమంతటా లక్షల హెక్టార్ల భూమి వక్ఫ్ పేరిట ఉందిఈ భూమిఈ ఆస్తి పేదలుఅసహాయ మహిళలుపిల్లలకు ఉపయోగపడాల్సిందిదీనిని నిజాయితీగా వినియోగించి ఉంటేఈరోజు నా ముస్లిం యువత పంచర్లు పడిన సైకిళ్లకు మరమ్మతు చేస్తూ జీవితం గడపాల్సిన పరిస్థితి ఉండేది కాదుకానీ ఈ ఆస్తుల వల్ల కొద్ది మంది భూ మాఫియాలకు మాత్రమే లాభం కలిగిందిపస్మండ ముస్లిం సామాజిక వర్గానికి ఎలాంటి ఉపయోగమూ కలగలేదుఇంకా ఈ భూ మాఫియాలు ఎవరిని దోచుకుంటున్నాయివారు దళితుల భూమినివెనుకబడినవారి భూమినిగిరిజనుల భూమినివితంతువుల ఆస్తిని దోచుకుంటున్నారువందలాది మంది ముస్లిం వితంతువులు భారత ప్రభుత్వానికి లేఖలు రాశారుఅప్పుడే ఈ చట్టం చర్చకు వచ్చిందివక్ఫ్ చట్టం లో చేసిన మార్పుల తర్వాత పేదల పై జరుగుతున్న ఈ దోపిడీకి అడ్డుకట్ట పడనుందిఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటేమేము ఒక బాధ్యతాయుతమైన,  ముఖ్యమైన పని చేశాంవక్ఫ్ చట్టంలో మేం మరో ఏర్పాటు కూడా చేశాంఇప్పుడు కొత్త చట్టం ప్రకారంవక్ఫ్ బోర్డు దేశంలోని ఏ మూలలోనైనా గిరిజనుల భూమినిఇంటినిఆస్తిని తాకే అవకాశం లేదురాజ్యాంగ పరిమితులను పాటిస్తూ గిరిజనుల ప్రయోజనాలను పరిరక్షించడంలో మేం గొప్ప పని చేశాంఈ నిబంధనలు వక్ఫ్ పవిత్ర స్ఫూర్తిని గౌరవిస్తాయని నేను ఆశిస్తున్నానుముస్లిం సమాజంలోని పేదపస్మాండ కుటుంబాలుముస్లిం మహిళలుముఖ్యంగా ముస్లిం వితంతువులుముస్లిం పిల్లలు తమ హక్కులను పొందుతారు.  భవిష్యత్తులో కూడా వారి హక్కులకు రక్షణ ఉంటుందిరాజ్యాంగ స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అప్పగించిన కర్తవ్యం ఇదిఇదే అసలైన స్ఫూర్తిఇదే నిజమైన సామాజిక న్యాయం.

మిత్రులారా,

దేశంలోనే కాదుప్రపంచంలోనూ బాబాసాహెబ్ నివసించిన ప్రదేశాలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయిరాజకీయం కోసం రాజ్యాంగం పేరుతో ప్రయోజనాలు పొందాలనుకునే వారుబాబాసాహెబ్‌కు సంబంధించిన ప్రతి స్థలాన్నీ అవమానించారుఆయనను చరిత్రనుంచి తొలగించడానికి ప్రయత్నించారుముంబయిలోని ఇండూ మిల్‌లో బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకం నిర్మించడానికి దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమించాల్సి వచ్చిందికానీబాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభావాన్ని రాబోయే తరాలకు చాటేందుకు 2014 తర్వాత,  మా ప్రభుత్వం ఎన్నో ముఖ్యమైన చర్యలు తీసుకుందిమా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనేఇండూ మిల్‌తో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్‌కు సంబంధించిన ప్రతి స్థలాన్ని అభివృద్ధి చేశాం.  ఆయన జన్మస్థలం మౌహ్ అయినాలండన్‌లోని ఆయన విద్యాభ్యాస స్థలం అయినాఢిల్లీలోని మహాపరినిర్వాణ స్థలం అయినాలేక నాగ్‌పూర్‌లోని దీక్షాభూమి అయినా ప్రతి స్థలాన్ని అభివృద్ధి చేశాం.  వీటన్నింటినీ పంచతీర్థంగా అభివృద్ధి చేశాంకొన్ని రోజుల కిందట దీక్షాభూమినాగ్‌పూర్‌కు వెళ్లి బాబాసాహెబ్‌కు నివాళులర్పించే అవకాశం నాకు లభించటం నా అదృష్టంగా భావిస్తున్నాను.

మిత్రులారా,

కాంగ్రెస్ వారు సామాజిక న్యాయం గురించి గొప్పగా మాట్లాడతారుకానీ భరతమాత  ఇద్దరు గొప్ప బిడ్డలయిన బాబాసాహెబ్ అంబేద్కర్చౌదరి చరణ్ సింగ్ లకు కాంగ్రెస్ భారతరత్న కూడా ఇవ్వలేదని మనం గుర్తుంచుకోవాలికేంద్రంలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్‌కి భారత రత్న లభించిందిఅదే సమయంలోచౌధరి చరణ్ సింగ్ కు కూడా భారతరత్నను బీజేపీ ప్రభుత్వం ప్రదానం చేసినందుకు మేం గర్వపడుతున్నాం

మిత్రులారా,

హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం కూడా సామాజిక న్యాయం,  పేదల సంక్షేమం దిశగా నిరంతరం శక్తినిచ్చే విధంగా పనిచేస్తోందిమీ అందరికీ తెలిసిన విషయమే అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసు — ఉద్యోగం కావాలంటే లేదా ఏదైనా పని చేయించుకోవాలంటేఎవరైనా ఒక నాయకుడి చుట్టూ తిరగాలి లేదా డబ్బు ఇవ్వాలితండ్రి భూమి అమ్మాల్సి వచ్చేదితల్లి గాజులు కూడా విక్రయించాల్సి వచ్చేదికాని నాయబ్ సింగ్ సైనీ  ప్రభుత్వంకాంగ్రెస్ అంటించిన ఆ వ్యాధిని పూర్తిగా నయం చేసింది అనే విషయాన్ని చెప్పడం నాకు ఆనందంగా ఉందిఎలాంటి ఖర్చు లేకుండాఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన హర్యానా ఘనత అద్భుతంనాకు అలాంటి స్నేహితులుఅలాంటి భాగస్వామ్య ప్రభుత్వం లభించినందుకు గర్వపడుతున్నానుఇక్కడి 25 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా చూసేందుకు కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నించిందికానీ ఒకవైపు ముఖ్యమంత్రి నాయబ్ సైనీ ప్రమాణస్వీకారం చేయగామరోవైపు వేలాది మంది యువతకు నియామక పత్రాలు అందాయిఇదీ బీజేపీ ప్రభుత్వ సుపరిపాలన.  మంచి విషయం ఏమిటంటేరాబోయే సంవత్సరాల్లో వేలాది కొత్త ఉద్యోగాలకు రోడ్ మ్యాప్ రూపొందించడం ద్వారా నాయబ్ సింగ్ సైనీ  ప్రభుత్వం పనిచేస్తోంది.

మిత్రులారా

హర్యానా ఎంతోమంది యువత సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తున్న రాష్ట్రంఒకే ర్యాంకు-  ఒకే పెన్షన్ విషయంలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ మోసం చేసిందికానీ అదే స్కీమ్‌ను అమలు చేసింది మా ప్రభుత్వమేఇప్పటివరకు హర్యానాలోని మాజీ సైనికులకు ఒకే ర్యాంకు -  ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీకింద రూ.13,500 కోట్లు అందించారుకానీకాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకం గురించి అబద్ధాలు చెబుతూమొత్తం దేశ సైనికులకోసం కేవలం రూ.500 కోట్లే ఖర్చు చేసిన విషయం మీకు గుర్తుండి ఉంటుందిఇప్పుడు మొత్తం హర్యానాలో 13 వేల 500 కోట్లు, 500 కోట్లు ఎక్కడ ఉన్నాయిఇది ఎలాంటి కంటితుడుపు చర్య అని మీరు అనుకుంటున్నారుకాంగ్రెస్ కు ఎవరితోనూ సంబంధం లేదన్నారు.

ఇప్పుడు మీరు ఆలోచించండిమొత్తం హర్యానాలో 13,500 కోట్లు ఎక్కడదేశం మొత్తానికి కేవలం 500 కోట్లు ఎక్కడఇది ఎలాంటి కంటితుడుపుకాంగ్రెస్‌కు ఎవరితోనూ సంబంధం లేదుదాని సంబంధం కేవలం అధికారంతో  మాత్రమేదళితులతో గానీవెనుకబడిన వర్గాలతో గానీదేశంలోని తల్లులుఅక్కచెల్లెళ్ళుకూతుళ్లతో గానీఆఖరుకి  మన సైనికులతో గానీ ఆ పార్టీకి సంబంధం లేదు

మిత్రులారా,

అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పాన్ని హర్యానా మరింత బలోపేతం చేస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉందిక్రీడలైనావ్యవసాయమైనా హర్యానా నేల ప్రపంచవ్యాప్తంగా తన పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంటుందిహర్యానాకు చెందిన నా కుమారులుకుమార్తెలపై నాకు చాలా నమ్మకం ఉందిఈ కొత్త విమానాశ్రయంఈ కొత్త విమానం హర్యానాను సాకారం చేయడానికి మరియు హర్యానా కలలను నెరవేర్చడానికి ప్రేరణగా మారుతుంది మరియు మీ ఆశీర్వాదాలు ఇవ్వడానికి మీరు ఇంత పెద్ద సంఖ్యలో రావడం నా అదృష్టం.హర్యానా కుమారులుకుమార్తెలపై నాకు ఎంతో విశ్వాసం ఉందిఈ కొత్త విమానాశ్రయంఈ కొత్త విమాన సర్వీసు — ఇవి హర్యానా ఆశయాలను సాకారం చేయడంలో ప్రేరణగా మారతాయిహర్యానా ప్రజల కలలు నెరవేర్చే దిశగా ఇది ముందడుగు అవుతుందిమీరంతా సమూహంగా తరలివచ్చి ఆశీర్వాదాలు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నానునేను మీ ముందు శిరస్సు వందనం చేస్తున్నానుమీ అందరికీ ఎన్నో విజయాలు కలగాలని కోరుకుంటూహృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను!

నాతో పాటు  కలిసి నినదించండి:

భారత్ మాతా కి… జైభారత్ మాతా కి… జైభారత్ మాతా కి… జై!

చాలా చాలా ధన్యవాదాలు!

గమనికఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం

 

***


(Release ID: 2121724) Visitor Counter : 13