ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దుర్గా నవరాత్రి నేపథ్యంలో మాతా రాణి పావన నవరూప ఆరాధన ప్రాశస్త్యం వివరించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 05 APR 2025 9:02AM by PIB Hyderabad

దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాతా రాణి దివ్య నవరూప ఆరాధన ప్రాశస్త్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. దీంతోపాటు మాతపై ఓ భక్తి గీతాన్ని ఆయన ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

   “నవరాత్రి వేడుకలలో భాగంగా మాతా రాణి పావన నవ రూపారాధనలో భక్తజనులందరూ అలౌకికానందంతో పరవశులవుతారు. ఈ నేపథ్యంలో మాతాస్తుతితో మనను మంత్రముగ్ధులను చేసేలా ఆలపించిన ఈ గీతం వింటూ మీరంతా ఆ దేవత ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

****


(रिलीज़ आईडी: 2119745) आगंतुक पटल : 69
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam