ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 02 MAR 2025 8:54AM by PIB Hyderabad

రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:


“దివ్యమైన రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మన సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనాలని కోరుకుంటున్నాను. ఈ పవిత్ర మాసం ఆత్మపరిశీలన, కృతజ్ఞత, భక్తిని తెలియజేయటమే కాకుండా కరుణ, దయ, సేవల విలువలను గుర్తుచేస్తుంది.

రంజాన్ శుభాకాంక్షలు!”


(Release ID: 2107558)