ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిబ్రవరి 28న న్యూఢిల్లీలో జరిగే జహాన్-ఎ-ఖుస్రో-2025 సంగీతోత్సవానికి ప్రధానమంత్రి హాజరు
ఈ ఏడాది 25వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న సూఫీ సంగీతోత్సవం
అమీర్ ఖుస్రో ఘన వారసత్వాన్ని వేడుక చేసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ కళాకారుల రాక
Posted On:
27 FEB 2025 6:30PM by PIB Hyderabad
న్యూఢిల్లీ సుందర్ నర్సరీలో ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు జరిగే జహాన్-ఎ-ఖుస్రో-2025 సూఫీ సంగీతోత్సవానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరవుతారు.
దేశానికి చెందిన విభిన్న కళలు సంస్కృతులను ప్రోత్సహించడంలో ప్రధానమంత్రి ముందున్నారు. ఈ దిశగా సూఫీ సంగీతం, కవిత్వం, నృత్యానికి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి జహాన్-ఎ-ఖుస్రో వేడుకలో ప్రధాని పాల్గొంటున్నారు. అమీర్ ఖుస్రో ఘన వారసత్వాన్ని వేడుక చేసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ కళాకారులు న్యూఢిల్లీ చేరుకుంటున్నారు.
ప్రముఖ దర్శకుడు, కళాకారుడు ముజఫర్ అలీ 2001లో ప్రారంభించిన ఈ ఉత్సవం, రూమీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ఏడాది 25వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న ఈ ఫెస్టివల్, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకూ జరుగుతుంది.
ఉత్సవంలో భాగంగా ఏర్పాటైన 'టీఈహెచ్' బజార్ (హస్తకళల బజార్)ను కూడా శ్రీ మోదీ సందర్శిస్తారు. బజార్ లో ‘ఒక జిల్లా - ఒక ఉత్పత్తి’ సహా దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన అద్వితీయ కళాఖండాలను ప్రదర్శిస్తారు. చేనేత, హస్తకళల ఉత్పత్తుల గురించి తెలిపే లఘు చిత్రాల ప్రదర్శన కూడా ఉంటుంది.
***
(Release ID: 2106891)
Visitor Counter : 36
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam