ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా ముగియడంతో ఈ ప్రతిష్ఠాత్మక పర్వాన్ని గురించిన కొన్ని ఆలోచనలను అక్షరీకరించాను: ప్రధానమంత్రి
• ఈ మహాపర్వం మన దేశ సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక శక్తిని అద్భుత రీతిన కళ్లకు కట్టింది: ప్రధానమంత్రి
Posted On:
27 FEB 2025 2:43PM by PIB Hyderabad
ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా ముగియడంతో, మన దేశ సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక శక్తిని అద్భుత రీతిన కళ్లకు కట్టిన ఈ ప్రతిష్టాత్మక మహా పర్వాన్ని గురించిన కొన్ని అంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మననం చేసుకొన్నారు. తాను రాసిన బ్లాగును చదవాల్సిందిగా ప్రతి ఒక్కరికి శ్రీ మోదీ విజ్ఞప్తి చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా ముగియడంతో, ఈ ప్రతిష్ఠాత్మక జనసందోహ పర్వాన్ని గురించి నాకు వచ్చిన ఆలోచనలను రాసి పెట్టాను. ఈ మహా పర్వం మన దేశ సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక శక్తికి అద్భుత నిదర్శనంగా నిలిచింది. ఆంగ్లంలో నేను రాసిన బ్లాగును చదవగలరు.’’
(Release ID: 2106664)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam