మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరీక్షా పే చర్చ 2025 మొదటి ధారావాహికలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


పరీక్షా పే చర్చ 2025 మొదటి ధారావాహికలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 13 FEB 2025 2:23PM by PIB Hyderabad

ఫిబ్రవరి 10, 2025న ప్రసారమైన పరీక్షా పే చర్చ (పీపీసీఎనిమిదో సంచిక మొదటి ధారావాహికలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్థులతో ముచ్చటించారుఢిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై దేశం నలుమూలలకు చెందిన విద్యార్థులతో ప్రధానమంత్రి లోతుగా చర్చించారుపోషకాహారం-ఆరోగ్యంఒత్తిడిని అధిగమించడంతమతో తామే పోటీపడటంనాయకత్వంపుస్తకాలకు అతీతంగా సంపూర్ణ వికాసంసానుకూతలను తెలుసుకోవడం తదితర అంశాలపై 36 మంది విద్యార్థులు ప్రధానమంత్రి నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నారువిద్యాపరమైన సవాళ్లను ఆత్మవిశ్వాసంతోఎదగాలనే మనస్తత్వంతో ఎదుర్కొనేందుకు విలువైన సూచనలుఆచరణాత్మక వ్యూహాలను ఈ పరస్పర చర్చా కార్యక్రమంలో విద్యార్థులు తెలుసుకున్నారు.

ఈ రోజు ప్రసారమైన మూడో ధారావాహికలో టెక్నికల్ గురూజీగా పేరు పొందిన గౌరవ్ చౌధరిఎడెల్ వైజ్ మ్యూచువల్ ఫండ్ ఎండీసీఈవో రాధికా గుప్త కృత్రిమ మేధమెషిన్ లెర్నింగ్‌ను విద్యార్థులకు పరిచయం చేశారుచాట్ జీపీటీఏఐ ఇమేజ్-జనరేషన్ టూల్స్‌కి సంబంధించిన అప్లికేషన్లను ప్రయోగాత్మకంగా వివరించారుసాంకేతికతను చదువు నుంచి దృష్టి మరల్చే సాధనంగా కాకుండా వారి సామర్ధ్యాన్ని పెంపొందించేదిగా సమర్థంగా ఎలా వినియోగించుకోవాలో విద్యార్థులకు తెలియజెప్పారుసాంకేతికతనువిద్యను ఏకీకృతం చేస్తున్న స్మార్ట్ స్టడీ యాప్‌లుడిజిటల్ నోట్స్ఆన్లైన్ లెర్నింగ్ వేదికలు విద్యార్థులకు ఎలా సాయం చేస్తున్నాయో వివరించారుఏఐపై పూర్తిగా ఆధారపడకుండా దాన్ని సాధనంగా ఉపయోగించుకోవాలనిటెక్నాలజీకి అతీతంగా వాస్తవిక అనుభవాలను స్వీకరించాలని సూచించారు.

ఏఐడేటా సైన్స్కోడింగ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యతను రాధికా గుప్త వివరించారుపెరుగుతున్న సాంకేతికత విస్తృతిని వివరిస్తూ విద్యార్థులు దాన్ని అర్థం చేసుకొని సరిగ్గా వినియోగించుకోవాలని సూచించారుఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నేర్చుకొనే విధానాన్ని మరింత ఆకట్టుకొనేలా చేయడానికి తరగతి గదిలో ఏఐను ఎలా ఉపయోగించుకోవచ్చో వివరించారుసాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక సాధనంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని కూడా ఆమె ప్రముఖంగా వివరించారుదాని నియంత్రణలోకి వెళ్లకుండాతమకు ఉపయోగపడేలా చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

దోహాఖతార్కువైట్ దేశాలకు చెందిన విద్యార్థులు సైతం ఏఐ అప్లికేషన్లువాటి ప్రభావం గురించి ప్రశ్నలు అడిగారుప్రాంప్ట్ ఇంజనీరింగ్ చిట్కాలను ఏఐ ఆధారిత డంబ్ షరాడ్స్ ఆట ద్వారా అతిథులు... విద్యార్థులకు వివరించారుభారత మాజీ రాష్ట్రపతిప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్ర పటాన్ని కృత్రిమ మేధ సాయంతో రూపొందించారు.

పరీక్షా పే చర్చ లాంటి కార్యక్రమానికి రూపకల్పన చేసితమ వృద్ధికి సాంకేతితను ఉపయోగించుకొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారుసాంకేతికతను సమర్థంగా వినియోగించుకొనేందుకు విలువైన సూచనలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రచించిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం గురించి కూడా వారు చర్చించారు.

మీ నిర్ణయాలు మీరే తీసుకోండి’, ‘సరిపడినంత నిద్ర’ వంటి పాఠాలతో సహా ఈ కార్యక్రమం నుంచి తాము నేర్చుకున్న విషయాలను విద్యార్థులు ధారావాహిక చివరిలో పంచుకున్నారు.

పీపీసీ ఎనిమిదో సంచిక కొత్త ఒరవడిని సృష్టించిందిఈ ఏడాది కోట్ల మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమం జన చైతన్యం కలిగించేదిగా తన హోదాను మరింత పెంచుకుందిప్రధానమంత్రితో రూపొందించిన మొదటి ఎపిసోడ్‌లో పాల్గొనేందుకు రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 36 మంది విద్యార్థులను ఎంపిక చేశారువీరిని రాష్ట్ర/యూటీ బోర్డుల ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ పాఠశాలలుకేంద్రీయ విద్యాలయసైనిక్ పాఠశాలఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలసీబీఎస్ఈనవోదయ విద్యాలయల నుంచి ఎంపిక చేశారుపరీక్షా పే చర్చ 2025లో మురో అయిదు ధారావాహికలు ప్రసారమవుతాయివివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జీవితంఅభ్యాసన గురించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారుప్రతి ఎపిసోడ్ ఒక ముఖ్యమైన అంశాన్ని తెలియజేస్తుంది.

ఫిబ్రవరి 12, 2025న ప్రసారమైన పరీక్షా పే చర్చ ఎనిమిదవ సంచిక రెండో ధారావాహికలో ప్రముఖ నటి దీపికి పదుకోణ్ 60 మంది విద్యార్థులతో సంభాషించారుతన సొంత అనుభవాల ద్వారా తెలుసుకున్న మానసిక ఆరోగ్య సమస్యలను అధిగమించడం ద్వారా సాధికారత ఎలా పొందవచ్చనే విలువైన పాఠాలను తెలియజేశారు.

మొదటి ఎపిసోడ్ లింక్https://www.youtube.com/watch?v=G5UhdwmEEls

రెండో ఎపిసోడ్ లింక్https://www.youtube.com/watch?v=DrW4c_ttmew

మూడో ఎపిసోడ్ లింక్https://www.youtube.com/watch?v=wgMzmDYShXw

 

***


(Release ID: 2102778) Visitor Counter : 34