ప్రధాన మంత్రి కార్యాలయం
మన భారతీయ అంకుర సంస్థలు అత్యాధునిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రభావాన్ని కలగజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను: ప్రధానమంత్రి
భారతదేశ యువ శక్తి బలాన్నీ, నైపుణ్యాల్నీ చూస్తే గర్వంగా ఉంది: ప్రధాని
‘అంకుర సంస్థల ఏర్పాటుకు భారత్ను అత్యంత ఆకర్షణీయ దేశంగా మన యువ శక్తి తీర్చిదిద్దింది’
Posted On:
16 JAN 2025 1:31PM by PIB Hyderabad
భారతీయ అంకుర సంస్థలు (స్టార్ట్-అప్స్) అంతర్జాతీయ స్థాయిలో బలమైన ముద్రను వేస్తున్నందుకు, అత్యాధునిక రంగాల్లో ప్రభావాన్ని కలగజేస్తున్నందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘భారతదేశ యువ శక్తి బలాన్నీ, వారి నైపుణ్యాన్నీ చూస్తే గర్వంగా ఉంది. అంకుర సంస్థల్ని ఏర్పాటు చేయడం ద్వారా అత్యంత ఆకర్షణీయ దేశాల్లో భారతదేశాన్ని ఒకటిగా మార్చారు’’ అని శ్రీ మోదీ ప్రశంసించారు.
మైగవ్ఇండియా (MyGovIndia) పోస్టుకు ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘మన భారతదేశ అంకుర సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో ముద్రను వేస్తుండడం, ముఖ్యంగా అత్యాధునిక రంగాల్లో ఈ విధంగా ప్రభావాన్ని కలగజేస్తుండడం ఆనందాన్ని ఇస్తోంది’’
#9YearsOfStartupIndia
‘‘భారతదేశ యువ శక్తి బలాన్నీ, నైపుణ్యాల్నీ చూస్తే గర్వంగా ఉంది. అంకుర సంస్థల్ని ఏర్పాటు చేయడానికి అనువైన అత్యంత ఆకర్షణీయ దేశాల్లో ఒక దేశంగా భారత్ను వారు మార్చేశారు.’’
#9YearsOfStartupIndia
***
MJPS/VJ
(Release ID: 2093468)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam