ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ సహకారాన్నీ, సుస్థిరంగా ఉంటూ సమానత్వాన్ని పెంపొందించే ప్రపంచాన్నీ ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉంది: ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 31 DEC 2024 8:37PM by PIB Hyderabad

భారతదేశం 2024లో జరిగిన వివిధ ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సమావేశాల్లో చురుకైన పాత్రను పోషించడం... అంతర్జాతీయ సహకారాన్నీ, సుస్థిరంగా ఉంటూ సమానావకాశాలను ప్రసాదించే ప్రపంచాన్నీ ప్రోత్సహించాలన్న ఇండియా నిబద్ధతను చాటిచెబుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

 

‘‘భారతదేశం 2024లో జరిగిన వివిధ ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సమావేశాల్లో పోషించిన చురుకైన పాత్ర అంతర్జాతీయ సహకారాన్నీ, సుస్థిరంగా ఉంటూ సమానావకాశాలను ప్రసాదించే ప్రపంచాన్నీ ప్రోత్సహించాలన్న ఇండియా నిబద్ధతను చాటిచెబుతున్నది’’.

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2089525) సందర్శకుల సూచీ సంఖ్య : : 64