ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చిన్న పిల్లలకు వారి మాతృభాషలోనే కొత్త కొత్త ఆలోచనలు, సాధనాలతో చదువు చెప్పాలన్న పద్ధతికి ఎన్ఈపీ 2020 దన్నుగా నిలుస్తోంది: ప్రధానమంత్రి

Posted On: 11 DEC 2024 11:27AM by PIB Hyderabad

చిన్న పిల్లలకు వారి మాతృ భాషలోనే కొత్త కొత్త పద్ధతులతో, సాధనాలతో విద్యను బోధించాలన్న విధానానికి ఎన్ఈపీ 2020 దన్నుగా నిలుస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

 

కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘చిన్నపిల్లలు విద్యాంశాలను లోతైన అవగాహనతో నేర్చుకోవడంలోనూ, వారిలో సృజనాత్మకతను పెంచిపోషించడంలోనూ, సంస్కృతి మూలాలను పరిరక్షించడంలోనూ వారికి విద్యను మాతృభాషలోనే బోధించడం ఎంత ముఖ్యమో కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ (@dpradhanbjp) విపులంగా వివరించారు.  ఈ విధానాన్ని కొత్త కొత్త పద్ధతుల్లో, సరికొత్త సాధనాలతో ముందుకు తీసుకువెళ్ళడానికి ఎన్ఈపీ 2020 ఏవిధంగా ఊతాన్నిస్తోందీ ఆయన వివరించారు - దీనిని చదువగలరు.’’

 

 

***

MJPS/SR


(Release ID: 2083496)