ప్రధాన మంత్రి కార్యాలయం
మన ధీర సైనికుల పరాక్రమం, సంకల్పం, త్యాగాలకు సమర్పించే వందనమే సాయుధ దళాల పతాక దినోత్సవం: ప్రధానమంత్రి
Posted On:
07 DEC 2024 2:41PM by PIB Hyderabad
మన ధీర సైనికుల పరాక్రమం, సంకల్పం, త్యాగాలకు సమర్పించే వందనమే సాయుధ దళాల పతాక దినోత్సవమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఆయన కోరారు.
“మన ధీర సైనికుల పరాక్రమం, సంకల్పం, త్యాగాలకు సమర్పించే వందనమే సాయుధ దళాల పతాక దినోత్సవం. వారి ధైర్య సాహసాలు మనకు స్ఫూర్తినిస్తాయి, వారి త్యాగాలకు మనం రుణపడి ఉన్నాం. వారి అంకితభావం మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధిలో కూడా పాలుపంచుకుందాం’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
MJPS/SR
(Release ID: 2082042)
Visitor Counter : 44
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam