ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్వాడ్ అధినేతల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభ ప్రసంగం ఆంగ్లానువాదం

నాడు పోస్టు చేయడమైనది: 22 SEP 2024 2:39AM by PIB Hyderabad

గౌరవనీయులు,

అమెరికా అధ్యక్షుడు బైడెన్,

ప్రధానమంత్రి కిషిదా,

ప్రధానమంత్రి ఆల్బనీస్...

నా మూడో పదవీ కాలంలోఅధికారిక హోదాలో మీ అందరితో కలిసి క్వాడ్ వేదికను పంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందిక్వాడ్ 20వ వార్షికోత్సవాలను జరుపుకునేందుకు శ్రీ బైడెన్ సొంతూరు విల్మింగ్టన్ ను మించిన గొప్ప వేదిక ఉండబోదు. ‘ఆమ్ట్రాక్ జో’ గా ప్రసిద్ధులైన మీరు ఈ నగరంతోనూడెలావర్ తోనూ పెనవేసుకున్న విధంగానేక్వాడ్ తో కూడా మీకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది.

మీ నేతృత్వంలో 2021 లో తొలి క్వాడ్ శిఖరాగ్ర సమావేశం జరిగ్గాగడిచిన ఈ స్వల్ప కాలంలోనే మన భాగస్వామ్యం అనేక రంగాలకు విస్తరించిందిమీరు చూపిన ప్రత్యేక శ్రద్ధే ఈ విజయానికి దోహదపడిందనడంలో ఎటువంటి సందేహం లేదుక్వాడ్ పట్ల చెక్కు చెదరని మీ నిబద్ధతమీ నాయకత్వంసహకారాల పట్ల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
మిత్రులారా,

ప్రపంచంయుద్ధాలుసమస్యల సుడిగుండంలో చిక్కుకున్న కఠినమైన సమయంలో మన సమావేశాలు జరుగుతున్నాయిఇటువంటి క్లిష్ట సమయంలోమానవ సంక్షేమమే ధ్యేయంగా,  మనం నమ్మే ప్రజాస్వామ్య విలువలు ప్రాతిపదికగాక్వాడ్ వేదికపై మనమంతా ఏకం కావాలిమనం ఎవరికీ వ్యతిరేకం కాదునిబంధనలను అనుసరించే ప్రపంచాన్నిదేశాల సార్వభౌమత్వాన్నిప్రాదేశిక సమగ్రతను మనం గౌరవిస్తాంశాంతియుత మార్గాల ద్వారా సమస్యల పరిష్కారం జరగాలని భావిస్తున్నాం.

స్వేచ్ఛాయుతసమ్మిళిత,  సుభిక్షమైన ఇండో పసిఫిక్ పట్ల మన ఉమ్మడి నిబద్ధత ఎరిగినదేఆరోగ్యంరక్షణకీలక నూతన సాంకేతికతలువాతావరణ మార్పులుసామర్ధ్యాల పెంపు వంటి విభిన్న రంగాల్లో మనమంతా కలిసి అనేక సమ్మిళిత సకారాత్మక చర్యలు చేపట్టాంమన సందేశం తిరుగులేనది – సహకారంభాగస్వామ్యంస్నేహాలను అందించేందుకు  క్వాడ్ సదా సన్నద్ధంగా ఉంటుంది.

శ్రీ బైడెన్నా ఇతర సహచారులకి మరొక్కమారు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, 2025 లో క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు  ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని తెలియచేస్తున్నాను.

కృతజ్ఞతలు!

గమనిక ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన వ్యాఖ్యలకు అనువాదం మాత్రమే.

 

***


(రిలీజ్ ఐడి: 2058382) సందర్శకుల సూచీ సంఖ్య : : 72