ప్రధాన మంత్రి కార్యాలయం

‘సంవత్సరీ’ సందర్భంగా సామరస్యానికీ, క్షమకీ గల ప్రాముఖ్యాన్ని గుర్తు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 07 SEP 2024 10:25PM by PIB Hyderabad

మంగళప్రదమైన ‘సంవత్సరి’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సందేశాన్ని సామాజిక ప్రసార మాథ్యమ వేదిక ‘ఎక్స్’ లో పంచుకున్నారు. సామరస్యానికీ, క్షమకీ మన జీవనంలో ఉన్న ప్రాముఖ్యాన్ని ఈ సందేశం లో ఆయన స్పష్టం చేశారు. సహానుభూతినీ, సంఘీభావాన్నీ అక్కున చేర్చుకొని, మన అందరం సాగిస్తున్న ప్రయాణంలో ముందున్న దారిని మనకు చూప గలిగిన దయ, ఏకత్వాల చైతన్యాన్ని పెంచుకోవలసిందంటూ పౌరులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

 

ప్రధాన మంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:

 

‘‘సద్భావనతో జీవనం గడపడానికీ, ఇతరులను క్షమించడానికీ ఎంతటి శక్తి ఉందో ‘సంవత్సరి’ సందర్భం ప్రముఖంగా ప్రకటిస్తోంది. సహానుభూతినీ, ఐకమత్యాన్నీ మనలో ప్రేరణను నింపేవిగా ఎంచి ఆ సద్గుణాలను అవలంబించాలని ఈ సంవత్సరీ మనకు చాటి చెబుతోంది. ఈ చైతన్యాన్ని అలవరచుకొని, సమష్టితత్వం తాలూకు బంధాన్ని గాఢతరంగా మలచుకోవడంతో పాటు ఆ బంధాన్ని మనం నవనీకరించుకొందాం. దయాళుత్వం, ఏకత్వాలు మన భావి జీవన యానంలో మనకు మార్గదర్శనం చేయుగాక. మిచ్చామి దుక్కడమ్.’’

  



(Release ID: 2053015) Visitor Counter : 17