ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

పారాలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తి జీవాంజికి ప్రధాని అభినందనలు

Posted On: 04 SEP 2024 6:37AM by PIB Hyderabad

పారిస్ పారాలింపిక్స్ లో మహిళల 400మీ.ల టీ20 విభాగంలో కాంస్య పతకం సాధించిన దీప్తి జీవాంజిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.

ఆమె నైపుణ్యాలు, పట్టుదలను ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

‘‘పారాలింపిక్స్ 2024లో మహిళల 400మీ.ల టీ20 విభాగంలో కాంస్యం సాధించిన దీప్తి జీవాంజికి అభినందనలు. అసంఖ్యాక ప్రజలకు ఆమె స్ఫూర్తిదాయకం. ఆమె నైపుణ్యాలు, పట్టుదల ప్రశంసనీయం”.

 

 

***

MJPS/SR



(Release ID: 2051724) Visitor Counter : 28