ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

బందర్ శేరి బెగావన్ లోని ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించిన ప్రధాని

Posted On: 03 SEP 2024 8:07PM by PIB Hyderabad

బందర్ శేరి బెగావన్ లోని ప్రసిద్ధ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. బ్రూనై ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హాజీ మహమ్మద్ ఇషామ్ తో కలిసి ఆ దేశ మత వ్యవహారాల మంత్రి హెచ్‌ఈ పెహిన్ దాటో ఉస్తాజ్ హాజీ అవాంగ్ బదరుద్దీన్ ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి భారతీయులు కూడా వచ్చి ప్రధానిని కలిశారు.

ఈ మసీదుకు బ్రూనై 28వ సుల్తాన్ (ఈ నిర్మాణాన్ని ప్రారంభించిన ప్రస్తుత సుల్తాన్ తండ్రి) మూడో ఒమర్ అలీ సైఫుద్దీన్ పేరు పెట్టారు. ఇది 1958 లో పూర్తయింది.



(Release ID: 2051553) Visitor Counter : 48