ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

పారాలింపిక్స్ లో పురుషుల హై జంప్ టి47 పోటీలో రజత పతకాన్ని గెలిచిన శ్రీ నిషాద్ కుమార్ కు ప్రధాన మంత్రి అభినందనలు


Posted On: 02 SEP 2024 10:50AM by PIB Hyderabad

పారాలింపిక్స్ లో పురుషుల హై జంప్ టి47 పోటీలో రజత పతకాన్ని గెలిచిన  శ్రీ నిషాద్ కుమార్ కు  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఈ రోజు అభినందనలు తెలిపారు.
 

శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘పారాలింపిక్స్ 2024 (#Paralympics2024) లో పురుషుల హై జంప్ టి47 పోటీలో రజత పతకాన్ని గెలిచి శ్రీ నిషాద్ కుమార్ (@nishad_hj) సాధించిన ప్రశంసనీయమైన ప్రదర్శనకు  ఆయనకు అభినందనలు.  ఉద్వేగం, దృఢ సంకల్పం ఉంటే దేనినైనా సాధించవచ్చని ఆయన చేసి చూపించారు.  దేశం ఉప్పొంగిపోతోంది.’’



(Release ID: 2050838) Visitor Counter : 38