ప్రధాన మంత్రి కార్యాలయం
‘పారిస్ పారాలింపిక్స్ 2024’ లో మన దేశ క్రీడాకారుల బృందం రాణించాలన్నదే 140 కోట్ల మంది భారతీయుల కోరిక: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
28 AUG 2024 9:46PM by PIB Hyderabad
‘పారిస్ పారాలింపిక్స్ 2024’లో పాల్గొననున్న భారతీయ క్రీడాకారిణులు, క్రీడాకారుల బృందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని వారి ధైర్య సాహసాలను, దృఢ సంకల్పాన్ని ప్రశంసిస్తూ వారు విజయం సాధించాలని భారతదేశంలో 140 కోట్ల మంది పౌరులు పూర్తి మద్దతును వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ప్రధాని ‘ఎక్స్’ లో ఇచ్చిన ఒక సందేశంలో ఇలా చెప్పారు:
‘‘పారిస్ పారాలింపిక్స్ (#Paralympics 2024) లో పాలుపంచుకొనే మన దేశ క్రీడాకారిణులు, క్రీడాకారుల దళం వివిధ ఆటల పోటీల్లో రాణించాలని 140 కోట్ల మంది భారతీయులు కోరుకొంటున్నారు. ప్రతి ఒక్క క్రీడాకారిణీ/క్రీడాకారుడి ధైర్యం, సాహసం, వారి దృఢనిశ్చయం యావద్దేశానికి ప్రేరణనిచ్చేవే. మన క్రీడాకారుల బృందం విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మనమంతా వారి వెన్నంటి నిలుస్తున్నాం. #Cheer4Bharat’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2049603)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Bengali
,
Odia
,
Manipuri
,
Assamese
,
Tamil
,
Malayalam