ప్రధాన మంత్రి కార్యాలయం
అధ్యక్షుడు శ్రీ పుతిన్ తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
భారత్,రష్యా ల ప్రత్యేక,విశేషాధికారాలతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్నిమరింత బలపరచడానికి తీసుకోదగ్గ చర్యలపై ఇద్దరు నేతల చర్చలు
ఉక్రెయిన్ లో తన పర్యటన విశేషాలను వెల్లడించిన ప్రధానమంత్రి; రష్యా,ఉక్రెయిన్ ల సమస్యకు పరిష్కారాన్నిసాధించాలంటే సంభాషణలు,దౌత్యం.. ఇవే ముందున్న మార్గం అంటూ ప్రధాని పునరుద్ఘాటన
Posted On:
27 AUG 2024 3:13PM by PIB Hyderabad
రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడారు.
భారత్- రష్యా 22వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా కిందటి నెలలో తాను చేపట్టిన రష్యా పర్యటన విజయవంతం అయిన సంగతిని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చారు.
అనేక ద్వైపాక్షిక అంశాలలో చోటు చేసుకొన్న పురోగతిని నేతలు ఇద్దరూ సమీక్షించారు. భారత్ , రష్యాల మధ్య అమలవుతున్న ప్రత్యేక, విశేషాధికారాలతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దుకోవడానికి చేపట్టదగ్గ చర్యలపైన కూడా వారు చర్చించారు.
పరస్పర ప్రయోజనం ముడివడివున్న అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా వారివురూ మాట్లాడుకున్నారు.
ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న రష్యా-ఉక్రెయిన్ ఘర్షణపై నేతలిద్దరూ తమ అభిప్రాయాలను వెల్లడించుకొన్నారు. ఉక్రెయిన్ ను ఇటీవల తాను సందర్శించినప్పటి విషయాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఘర్షణకు స్వస్తి పలికేందుకు- చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాల ప్రాధాన్యతను వివరిస్తూనే, అన్నిభాగస్వామ్య పక్షాలూ, కట్టుబాటుతో కూడిన శాంతియుత పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఇద్దరు నేతలు ఒకరితో మరొకరు సంప్రదింపులు జరపడాన్ని కొనసాగించాలని సమ్మతించారు.
***
(Release ID: 2049172)
Visitor Counter : 107
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam