ప్రధాన మంత్రి కార్యాలయం

పారిస్ ఒలింపిక్స్ 2024 లో పురుషుల 50 మీటర్ ల రైఫిల్ మూడు పొజిషన్ లలో కాంస్య పతకాన్ని శ్రీ స్వప్నిల్ కుసాలే సాధించినందుకు ప్రధాన మంత్రి అభినందనలు

Posted On: 01 AUG 2024 2:38PM by PIB Hyderabad

ఒలింపిక్స్ 2024 లో పురుషుల 50 మీటర్ ల రైఫిల్ మూడు పొజిషన్ లలో కాంస్య పతకాన్ని శ్రీ స్వప్నిల్ కుసాలే గెలిచిన సందర్భంగా ఆయనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

‘‘శ్రీ స్వప్నిల్ కుసాలే అసామాన్య ప్రదర్శన ఇది! పారిస్ ఒలింపిక్స్ 2024 లో పురుషుల 50 మీటర్ ల రైఫిల్ మూడు పొజిషన్ లలో కాంస్య పతకాన్ని గెలిచినందుకు ఆయనకు అభినందనలు.

ఆయన ప్రదర్శన అద్వితీయంగా ఉంది.  ఎందుకంటే ఆయన అద్భుత రీతిన ముందడుగు వేసి, మంచి ఆటతీరును కనబరచారు. ఈ శ్రేణిలో పతకాన్ని గెలిచిన తొలి భారతీయ క్రీడాకారుడు కూడా ఆయనే.


ఈ విజయాన్ని చూసి భారతదేశంలో ప్రతి ఒక్కరు సంతోషం తో ఉప్పొంగిపోతున్నారు.’



 

 

 

***

 

DS/TS



(Release ID: 2040198) Visitor Counter : 40