ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తమ వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలు, డిజిటలైజేషన్‌ను అమలు చేయడం కోసం రాష్ట్రాలకు ప్రోత్సాహం : కేంద్ర బడ్జెట్ 2024-25


దివాలా, దివాలా కోడ్ కింద ఫలితాలను మెరుగుపరచడానికి ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ ఏర్పాటు

ఐబీసి ద్వారా 1,000 కంటే ఎక్కువ కంపెనీకు పరిష్కారం, దీని ఫలితంగా రుణదాతలకు 3.3 లక్షల కోట్లకు పైగా ప్రత్యక్ష రికవరీ : శ్రీమతి నిర్మలా సీతారామన్

ఎల్ఎల్పి లను స్వచ్ఛందంగా మూసివేయడం, మూసివేత సమయాన్ని మరింత తగ్గించడం కోసం కేంద్రం సేవలు వేగవంతం

రుణ పునరుద్ధరణ ట్రిబ్యునళ్లను బలోపేతం చేయడం, రుణ రికవరీని వేగవంతం చేయడానికి అదనపు ట్రిబ్యునళ్ల ఏర్పాటు

Posted On: 23 JUL 2024 12:56PM by PIB Hyderabad

 'వికసిత్ భారత్' సాధన కోసం, అందరికీ విస్తారమైన అవకాశాలను కల్పించేందుకు సవివరమైన రోడ్‌మ్యాప్‌లో భాగంగా, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో పలు ప్రతిపాదనలు చేశారు. 'వ్యాపారం చేయడం సులభతరం', దివాలా మరియు దివాలా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టితో 9 ప్రాధాన్యతలపై నిరంతర ప్రయత్నాలను జరుపుతున్నారు. 

 

సులభతర వ్యాపారం 

"ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని పెంపొందించడం కోసం, మేము ఇప్పటికే జన్ విశ్వాస్ బిల్లు 2.0పై పని చేస్తున్నాము," అని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు, అదే సమయంలో రాష్ట్రాలు తమ వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలు, డిజిటలైజేషన్ అమలు కోసం ప్రోత్సహిస్తామని ప్రతిపాదించారు.

ఐబిసి పర్యావరణ వ్యవస్థను పటిష్టం చేయడం 

ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ కోడ్ (ఐబీసి) కింద ఫలితాలను మెరుగుపరచడం కోసం ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు, తద్వారా స్థిరత్వం, పారదర్శకత, సమయానుకూల ప్రాసెసింగ్, అన్ని వాటాదారులకు మెరుగైన పర్యవేక్షణ ఉండేలా చూస్తుంది.

ఐబిసి 1,000 కంటే ఎక్కువ కంపెనీలను పరిష్కరించిందని, ఫలితంగా రుణదాతలకు రూ. 3.3 లక్షల కోట్లకు పైగా నేరుగా రికవరీ అయ్యిందని  శ్రీమతి నిర్మలా సీతారామన్   స్పష్టం చేశారు. అదనంగా, 10 లక్షల కోట్లకు పైగా ఉన్న 28,000 కేసులు అడ్మిషన్‌కు ముందే పరిష్కారం అయ్యాయి. దివాలా పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ఐబిసికి తగిన మార్పులు, సంస్కరణలు, ట్రిబ్యునల్, అప్పిలేట్ ట్రిబ్యునళ్లను బలోపేతం చేయడం ప్రారంభానికి ప్రతిపాదన చేసారు. 

కేంద్ర మంత్రి అదనపు ట్రిబ్యునల్‌ల ఏర్పాటును కూడా ప్రతిపాదించారు, వాటిలో కొన్నింటికి ప్రత్యేకంగా కంపెనీల చట్టం కింద కేసులను పరిష్కరించేందుకు నోటిఫై చేస్తారు.

ఎల్ఎల్పి ల స్వచ్ఛంద మూసివేత 

సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సిలరేటెడ్ కార్పోరేట్ ఎగ్జిట్ (సి-పేస్) సేవలు కూడా పరిమిత బాధ్యత భాగస్వామ్యాలను (ఎల్ఎల్పిలు) స్వచ్ఛందంగా మూసివేయడం కోసం పొడిగించాలని ప్రతిపాదన, తద్వారా మూసివేత సమయం తగ్గుతుంది.

రుణ రికవరీని బలోపేతం చేయడం

రుణ రికవరీ ట్రిబ్యునల్‌లను సంస్కరించడం, బలోపేతం చేయడం కోసం చర్యలు తీసుకోవాలని, రికవరీని వేగవంతం చేయడానికి అదనపు ట్రిబ్యునల్‌లను ఏర్పాటు చేయాలని కూడా బడ్జెట్ లో ప్రతిపాదించారు. 

***


(Release ID: 2036152) Visitor Counter : 198