ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆదివాసీ సముదాయాలకు సామాజిక, ఆర్థిక స్థితి లో మెరుగుదల కోసం ‘ప్రధాన మంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’ ను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి


ఆదివాసీలు ఎక్కువగా ఉన్న గ్రామాలలో, మహత్వాకాంక్షయుక్త జిల్లాలలో ఆదివాసీ కుటుంబాలన్నింటికీ ఈ పథకం ప్రయోజనాలను అందిస్తుంది

అయిదు కోట్ల మంది ఆదివాసీ ప్రజలకు ప్రయోజనాలను అందించాలన్నఉద్యేశ్యంతో 63,000 గ్రామాలలో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది


प्रविष्टि तिथि: 23 JUL 2024 12:48PM by PIB Hyderabad

ప్రభుత్వం ప్రధాన మంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ను ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ఈ రోజు ‘కేంద్ర బడ్జెటు 2024-25 ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రకటించారు.

 

 

 

 

 

 

 

ఈ అభియాన్ ఆదివాసీ సముదాయాల సామాజికఆర్థిక స్థితిలో మెరుగుదలను తీసుకు రానుందని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు.  మానవ వనరుల అభివృద్ధిసామాజిక న్యాయం ధ్యేయాలుగా  అభివృద్ధి ఫలాలను అందరికీ అందించాలని’ ఈ పథకంలో ప్రతిపాదించడమైందని మంత్రి అన్నారు.  ఆదివాసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటున్న గ్రామాలలోనుమహత్వాకాంక్షయుక్త జిల్లాలలోను ఆదివాసీ కుటుంబాలన్నీ సంపూర్ణ ప్రయోజనాలను అందుకొనే విధంగా ఈ పథకాన్ని లక్షించినట్లు ఆమె చెప్పారు.

 

ప్రధాన మంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’ లో 63,000 గ్రామాలు చేరుతాయి. దేశంలో కోట్ల మంది ఆదివాసీ సముదాయానికి లాభాన్ని చేకూర్చాలన్నదే ఈ పథకం లక్ష్యం.

 

***


(रिलीज़ आईडी: 2036140) आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Khasi , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam