ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

‘హూల్ దివస్’ నేపథ్యంలో గిరిజన వీరులకు ప్రధానమంత్రి నివాళి

Posted On: 30 JUN 2024 2:32PM by PIB Hyderabad

   హూల్ దివస్ నేపథ్యంలో బ్రిటిష్ సామ్రాజ్య దురాగతాలపై అత్యంత ధైర్యసాహసాలతో తిరుగుబాటు చేసిన సిద్ధూ-కన్హు, చాంద్-భైరవ్, ఫూలో-ఝానో వంటి గిరిజన వీరుల ఆత్మగౌరవానికి, శౌర్యానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘హూల్ దివస్ (సంథాల్ తిరుగుబాటు) మన గిరిజన సమాజం ప్రదర్శించిన పోరాట పటిమకు, శౌర్యపరాక్రమాలకు, త్యాగానికి ప్రతీకగా నిలిచే గొప్ప సందర్భం’’ అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.



(Release ID: 2029844) Visitor Counter : 65